TAX: టాక్స్ పేయర్లకు కేంద్రం కీలక సూచనలు

పన్ను చెల్లించే వారికి కేంద్రం కీలక సూచనలు చేసింది. ట్యాక్స్ కట్టేవారు 2025-26 అసెస్మెంట్ సంవత్సరం కోసం ఆదాయపు పన్ను పోర్టల్లో రిటర్నులను ఫైల్ చేయవచ్చు. కొన్ని వర్గాల వారికి ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాలు.. ట్యాక్స్ చెల్లించడంలో కొంత ఊరట కలిగిస్తున్నాయి. నిర్దిష్ట పరిమితుల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు, దేశంలోని కొన్ని ప్రాంతాలలో నివసించే వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పన్ను విధించదగిన ఆదాయం ఉన్న ప్రతి వ్యక్తి, వారి ఖాతాలు ఆడిట్కు బాధ్యత వహించని వారు తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయాలి. పన్ను పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉండి పన్ను చెల్లించకుండా మినహాయింపు పొందిన వారు, తాము చెల్లించిన పన్ను మొత్తాన్ని పూర్తిగా తిరిగి పొందుతారు.అయితే, ఈ వ్యక్తులు తాము పొందిన ఆదాయాన్ని, మినహాయింపులను చెల్లుబాటు అయ్యే పత్రాలతో క్లెయిమ్ చేయడానికి వెల్లడించాలి.
సీనియర్ సిటిజన్లకు మినహాయింపు
75 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, ఒక నిర్దిష్ట బ్యాంకు ఖాతా నుంచి పెన్షన్, వడ్డీ ఆదాయం పొందుతున్న వారు తమ రిటర్నులను ఫైల్ చేయకుండా ఉండవచ్చు. సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లు ఫారం 12BBA ద్వారా ఒక డిక్లరేషన్ను పూర్తి చేసి, దానిని సంబంధిత బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఒక వ్యక్తి మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించకపోతే, వారు ఐటీఆర్ ఫైల్ చేయవలసిన అవసరం లేదు. ఈ పరిమితి వయస్సు ఆదాయపు పన్ను శ్లాబ్ల ప్రకారం మారుతుంది. అయితే, పన్ను చెల్లించనవసరం లేకపోయినా, సంబంధిత ఫారమ్ను సమర్పించడంలో, మీ ఆర్థిక లాభాలను ప్రకటించడంలో విఫలమైతే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com