Autopsy Report: కోల్కతా డాక్టర్ పోస్ట్మార్టం నివేదిక

కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో దారుణ హత్యాచారానికి గురైన ట్రెయినీ డాక్టర్ కేసులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. డాక్టర్ మరణానికి కారణం ఊపిరి ఆడకపోవడమేనని ఈ రిపోర్టు వెల్లడించింది. గొంతు నులమడం వల్ల చనిపోయి ఉండవచ్చని పేర్కొంది. అయితే ఈ రిపోర్ట్ లో వివరాలు ప్రతీ జాతీయ మీడియా లోనూ కాస్త కాస్త మార్పులతో కనిపిస్తున్నాయి.
వైద్యురాలిని దారుణంగా అత్యాచారం చేశారని, ఆమె శరీరంపై 14 చోట్ల గాయాలు ఉన్నాయని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. ట్రైనీ డాక్టర్ శరీరంపై 14 చోట్ల గాయాలు ఉన్నాయని శవపరీక్షలో గుర్తించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. బలవంతంగా లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని నివేదికలో ఉంది. బాధితురాలి తల, ముఖం, మెడ, చేతులు సహా జననాంగాలపై 14 గాయాలు ఉన్నట్లు పోస్ట్మార్టంలో గుర్తించారు. ఆమె ఊపిరితిత్తుల్లో అధిక మొత్తం రక్తస్రావం జరిగినట్లు తెలుస్తోంది. శవపరీక్ష నివేదిక ఆధారంగా ఆమె దారుణంగా అత్యాచారం మరియు హత్యకు గురైందట.
అత్యాచార సమయంలో నిందితుడి సంజయ్ రాయ్తో వైద్యురాలు శక్తి మేరకు పోరాడి ఉంటుందని వైద్యులు పోస్ట్మార్టం నివేదికలో పేర్కొన్నారు. సంజయ్కి వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు.. అతడి శరీరంపై బాదితురాలు గోళ్లతో రక్కిన గుర్తులు కన్పించాయట. అలానే బాధితురాలి మృతదేహాన్ని పరిశీలించగా.. ఆమె గోళ్లలోని చర్మం, రక్త నమూనాలు నిందితుడి నమూనాలతో మ్యాచ్ అయ్యాయట. గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడం వల్లే బాధితురాలు మృతిచెందినట్లు పోస్ట్మార్టం నివేదికలో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com