Lokayukta Raid: నోట్లు మింగిన అవినీతి అధికారి

లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఓ అధికారి.. వారికి దొరక్కుండా తప్పించుకోడానికి తన చేతిలో ఉన్న నోట్లను గుటుక్కున మింగేశాడు. దీంతో షాకైన ఏసీబీ అధికారులు.. వెంటనే అతడి మింగిన నోట్లను కక్కించారు. విస్తుగొలిపే ఈ ఘటన కర్ణాటకలోని కొప్పళలో డిసెంబరు 21న చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే
కొప్పళ జిల్లా సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్ దస్తగిరి అలీ.. ఓ స్వచ్ఛంద సంస్థకు అనుమతి పత్రం ఇచ్చేందుకు రూ.2వేలు లంచం డిమాండ్ చేశాడు. ఆ సంస్థకు చెందిన భీమనగౌడ అనే వ్యక్తి లోకాయుక్త అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నెల 21న భీమనగౌడ రూ.500 నోట్లు నాలుగు దస్తగిరి అలీకి ఇవ్వగా అవి చేతిలో ఉన్న సమయంలోనే లోకాయుక్త అధికారులు పట్టుకున్నారు. అంతలోనే ఆ నోట్లను దస్తగిరి ఉండలా చుట్టి నోట్లో వేసుకున్నాడు. లోకాయుక్త అధికారులు ఆ నోట్లను కక్కించి కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు... దర్యాప్తు చేపట్టారు. ఈ ఆపరేషన్ రాయచూర్ లోకాయుక్త ఎస్పీ శశిధర్ పర్యవేక్షణలో జరిగింది. అయితే, గతంలోనూ పలుచోట్ల ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అవినీతి నిరోధక శాఖ అధికారుల నుంచి తప్పించుకోడానికి నోట్లను మింగేయడం, టాయ్లెట్ ఫ్లష్లో పడేయం చేస్తుంటారు. రెండేళ్ల కిందట మధ్యప్రదేశ్లో లంచం డబ్బు తీసుకుంటూ లోకాయుక్తకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఓ ఉద్యోగి తన చేతిలో ఉన్న నోట్లను నమిలి మింగేశాడు. కట్నీ జిల్లాలోని రెవెన్యూ విభాగానికి చెందిన పట్వారీ గజేంద్రసింగ్ ..ఓ భూమి కేసులో రూ.5వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో అతడ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com