LABOUR CODES: కొత్త లేబర్ కోడ్స్... ఆందోళన అవసరం లేదు

కేంద ప్రభుత్వం ఇటీవల కొత్త కార్మిక సంస్కరణలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పాత వాటిని పునరుద్దరించి కొత్త వాటిని ప్రవేశపెట్టింది. వీటి వల్ల అన్ని రంగాల్లోని ఉద్యోగులకు ఆర్ధిక, సామాజిక భద్రత లభించనుంది. గిగ్ వర్కర్లకు కూడా ఇవి వర్తించనున్నాయి. పాత వాటిల్లో మార్పులు చేసి కొత్తగా తెచ్చిన నాలుగు కార్మిక కోడ్లలో అనేక అంశాలపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ లేబర్ కోడ్లలో ఉద్యోగి జీతం నుంచి పీఎఫ్, ఇతర వెల్ఫేర్ స్కీమ్స్కు ఎక్కువ మొత్తంలో వాటా వెళ్లేలా నిబంధనలు ఉన్నాయని కొంతమందిలో అయోమయం నెలకొంది. దీని వల్ల టేక్ హోమ్ శాలరీ తగ్గుతుందనే వార్తలు వస్తు్న్నాయి. దీంతో కార్మిక శాఖ తాజాగా క్లారిటీ ఇచ్చింది.
కొత్త సంస్కరణల వల్ల టేక్ హోమ్ శాలరీలో ఎలాంటి మార్పులు ఉండవని కార్మికశాఖ స్పష్టతను ఇచ్చింది. ఈపీఎఫ్కి సంబంధించి చట్టబద్ద వేతన పరిమితి రూ.15 వేలుగానే ఉంది. దీనిపై కొత్త లేబర్ కోడ్ల ప్రభావం అసలు ఉండదని స్పష్టతనిచ్చింది. రూ.15 వేల పరిమితికి మంచి మీరు కాంట్రిబ్యూట్ చేసుకోవాలంటే అది మీ వ్యక్తిగత విషయమని తెలిపింది. కంపెనీలు తప్పనిసరిగా ఈ పరిమితిని అమలు చేయాల్సిన అవసరం కూడా లేదంది. ఉద్యోగి, కంపెనీ మధ్య మ్యూచువల్ అండర్స్టాడింగ్ను బట్టి పెంచుకోవాలా.. వద్దా అనేది సొంత నిర్ణయమని చెప్పుకొచ్చింది. దీని వల్ల మీ టేక్ హోమ్ శాలరీలో ఎలాంటి మార్పులు లేవని పేర్కొంది. నెలకు రూ.60 వేల శాలరీ మీకు వస్తుదనుకున్నాం. పాత చట్టాల ప్రకారం ఈపీఎఫ్ ఉద్యోగి వాటా రూ.1800, కంపెనీ వాటా రూ.1800 పోతే రూ.56,400 టేక్ హోమ్ శాలరీ అందుతుంది. అయితే కొత్త లేబర్ కోడ్ల ప్రకారం ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితిలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీని వల్ల మీకు పాత విధానం ద్వారానే టేక్ హోమ్ శాలరీలో ఎలాంటి మార్పులు ఉండవని కార్మికశాఖ స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులు =-ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
బెనిఫిట్స్ ఇవే
ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులు: ఇకపై వీరు పర్మనెంట్ ఉద్యోగుల మాదిరిగానే లీవ్, మెడికల్ కవర్, సోషల్ సెక్యూరిటీ వంటి అన్ని ప్రయోజనాలు పొందుతారు. గ్రాట్యుటీకి 5 ఏళ్లు ఆగకుండా ఏడాదికే అర్హత లభిస్తుంది. గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లు: పెరుగుతున్న ఈ వర్కర్ల సంక్షేమం కోసం కంపెనీలు వార్షిక ఆదాయంలో 1-2% వెచ్చించాల్సి ఉంటుంది. వారికి ఆధార్ లింక్ అయిన యూఏఎన్ నంబర్తో పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులు: వీరికి ఏడాదికోసారి ఉచిత ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్య, సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలు కల్పించాలి. వీరికి కూడా ఏడాది తర్వాత గ్రాట్యుటీకి అర్హత లభిస్తుంది. మహిళా ఉద్యోగులు: లింగ వివక్షను తొలగించారు. సమాన పనికి సమాన వేతనం తప్పనిసరి. మహిళలు నైట్ షిఫ్ట్లు, అండర్ గ్రౌండ్ మైనింగ్ వంటి ప్రమాదకర ప్రాంతాల్లో కూడా పని చేయవచ్చు. ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులు: వీరికి ప్రతి నెలా 7వ తేదీలోపు జీతాలు అందాలి. మహిళలు నైట్ షిఫ్టులు చేయవచ్చు. మీడియా వర్కర్లు: వీరికి అపాయింట్మెంట్ లెటర్స్, సోషల్ సెక్యూరిటీ రైట్స్ తప్పనిసరి. ఓవర్ టైమ్ చేస్తే సాధారణ వేతనానికి రెండింతలు చెల్లించాలి. యూత్ వర్కర్లు: అన్ని కేటగిరీల్లోని వర్కర్లకు కనీస వేతనం, అపాయింట్మెంట్ లెటర్ తప్పనిసరి. ఎంఎస్ఎంఈ వర్కర్లు: వీరికి సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 వర్తిస్తుంది. పని ప్రదేశంలో రెస్ట్ ఏరియా, డ్రింకింగ్ వాటర్, క్యాంటీన్ వంటివి కల్పించాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

