ఈశాన్య రాష్ట్రాలో భారీ వర్షాలు, వరదలు.. 36కి చేరిన మృతులు, 5.5 లక్షలకు పైగా బాధితులు

ఈశాన్య రాష్ట్రాలో భారీ వర్షాలు, వరదలు.. 36కి చేరిన మృతులు, 5.5 లక్షలకు పైగా బాధితులు
X
సిక్కింలో కొండచరియలు విరిగిపడిన ఛాటెన్ నుండి 34 మందిని హెలికాప్టర్ల ద్వారా తరలించారు.

ఈశాన్య ప్రాంతంలో వరద పరిస్థితి తీవ్రంగా మారింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పరిస్థితులు ఉదృతంగా మారాయి. కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య 36కి పెరిగింది. ఈ ప్రాంతంలోని అనేక రాష్ట్రాల్లో 5.5 లక్షలకు పైగా ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు.

కొండచరియలు విరిగిపడటంతో, అస్సాంలో అత్యధికంగా 11 మంది మరణించగా, అరుణాచల్ ప్రదేశ్‌లో 10 మంది, మేఘాలయలో ఆరుగురు, మిజోరాంలో ఐదుగురు, సిక్కింలో ముగ్గురు మరియు త్రిపురలో ఒకరు మరణించారు. అస్సాంలోని 22 జిల్లాల్లో 5.35 లక్షలకు పైగా ప్రజలు వరదల బారిన పడ్డారని, మృతుల సంఖ్య ఒకటి పెరిగి 11కి చేరుకుందని, 15 నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అత్యంత దెబ్బతిన్న ప్రాంతాలలో ఒకటైన లఖింపూర్ జిల్లాను సందర్శించి, బాధిత ప్రజలకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా రోడ్డు, రైలు, ఫెర్రీ సేవలు ప్రభావితమయ్యాయి. మంగళవారం (జూన్ 3, 2025) ఉత్తర సిక్కింలోని ఛాటెన్ కొండచరియలు విరిగిపడిన ప్రాంతం నుండి ముప్పై నాలుగు మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. రెండు MI-17 V5 హెలికాప్టర్లు తరలింపు మిషన్‌ను పూర్తి చేసి, 34 మందితో పాక్యోంగ్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయని అధికారులు తెలిపారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మంగన్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి, ఫిడాంగ్ మరియు సంగ్‌కలాంగ్‌లలో వంతెనలు పాక్షికంగా దెబ్బతిన్నాయి మరియు చాలా రోజుల పాటు రోడ్డు రవాణాకు అంతరాయం కలిగింది.

130 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదవడంతో, లాచెన్, లాచుంగ్, గురుడోంగ్మార్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మరియు జీరో పాయింట్ వంటి కీలక పర్యాటక ప్రదేశాలకు వెళ్లే మార్గాల్లో తీవ్ర నష్టం సంభవించింది. పర్యాటకులు వాతావరణ పరిస్థితుల ఆధారంగా వారి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని కోరింది.



Tags

Next Story