Indian Army: డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌..

Indian Army: డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌..
X
ఇది ఇండియన్‌ ఆర్మీలోని అత్యంత కీలకమైన నియామకం

పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆపరేషన్ సింధూర్ లో భాగమైన రాజీవ్ ఘాయ్‌కు మరో బాధ్యత లభించింది. భారత ప్రభుత్వం ఆయనను డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా నియమించింది. దీనితో పాటు, ఆయన భారత DGMOగా కూడా పనిచేస్తారు. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనతో ధృవీకరించింది. భారత సైన్యం, నిఘా సంస్థతో సహా ఇతర ముఖ్యమైన విభాగాల మధ్య సమన్వయం కోసం డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (స్ట్రాటజీ) పదవిని సృష్టించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది భారత సైన్యంలోని ముఖ్యమైన పోస్టులలో ఒకటి.

జూన్ 4న జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెర్మనీ 2025 సందర్భంగా లెఫ్టినెంట్ రాజీవ్ ఘాయ్‌కి ఉత్తమ యుద్ధ సేవా పతకం లభించింది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత సైన్యం విలేకరుల సమావేశానికి లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘయ్ నాయకత్వం వహించారు. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) కాల్పుల విరమణ కోసం లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘైకి ఫోన్ చేసి, ఆ తర్వాత మే 12న జరిగిన విలేకరుల సమావేశంలో భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను ప్రకటించారు.

లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఎవరు?

లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ కుమావున్ రెజిమెంట్‌లో సీనియర్ అధికారి. భారత సైన్యంలో కీలక ఆపరేషన్లకు నాయకత్వం వహించారు. డీజీఎంఓ కావడానికి ముందు, ఆయన చినార్ కార్ప్స్‌కు GOCగా ఉన్నారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అనేక మిషన్లలో రాజీవ్ ఘాయ్ ముఖ్యమైన పాత్ర పోషించారు.

Tags

Next Story