అయోధ్య రామమందిరం అద్భుతం: శ్రీలంక ఎంపీ

ప్రారంభించిన నెలలోపే, ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరం ఊహించినట్లుగానే ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో 2024 జనవరి 22న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ అత్యంత శోభాయమానంగా జరిగింది. ఈ తరువాతి రోజు జనవరి 23, 2024న సామాన్య భక్తుల కోసం ఆలయాన్ని తెరిచి ఉంచారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు.
ఇటీవల, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరోసారి ఆలయానికి హాజరై బాల రాముడి భక్తితో కొలిచారు. ఇప్పుడు, మరో అంతర్జాతీయ ప్రముఖుడు పవిత్ర స్థలాన్ని సందర్శించడం ద్వారా వార్తల్లో నిలిచారు. శ్రీలంక పార్లమెంటు సభ్యుడు నమల్ రాజపక్స తన భార్యతో కలిసి రామమందిరాన్ని సందర్శించేందుకు శుక్రవారం అయోధ్యకు వచ్చారు. మందిరాన్ని సందర్శించడం 'గౌరవంగా మరియు ఆశీర్వాదంగా' భావించానన్నారు రాజపక్స.
మహా ఆలయాన్ని సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడిన లంక ఎంపీ రాముడి 'ప్రాణ్ ప్రతిష్ఠ'తో దేవుడి అసలు జన్మస్థలానికి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చారని అన్నారు.
"మేము ఇక్కడ ఉన్నందుకు సంతోషిస్తున్నాము. అయోధ్యలోని శ్రీరాముని నివాసంలో ఆయన ఆశీర్వాదాలు పొందడం మాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాము. శ్రీలంక వ్యక్తిగా బౌద్ధ సంస్కృతిలో పాతుకుపోయిన నేపథ్యంలో ఎదుగుతూ హిందూ సమాజానికి చాలా దగ్గరగా ఉన్నందున ఇది నాకు మరింత ప్రత్యేకమైనది. ఈ రోజు ఇక్కడ ఉండటం నాకు, నా భార్యకు గొప్ప గౌరవం” అని లంక ఎంపీ అన్నారు.
అయోధ్య రామమందిర నిర్మాణంలో ప్రధాని మోదీ స్వయంగా పాలుపంచుకోవడం గొప్ప విషయమని ఆయన అన్నారు. ఈ అద్భుతమైన ఆలయాన్ని సందర్శించి శ్రీరాముని ఆశీస్సులు పొందే అవకాశం కోసం ఎదురుచూస్తున్న నాలాంటి అనేక మంది భక్తులు ప్రపంచం నలుమూలల ఉన్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని రాజపక్స్ తెలిపారు.
Tags
- Ayodhya Ram Mandir
- Ayodhya Ram Mandir Sri Lankan MP visit
- Sri Lanka
- Sri Lanka India
- Sri Lanka MP visits Ayodhya Ram Mandir
- Ayodhya Ram Mandir latest news
- Namal Rajapaksa
- Namal Rajapaksa Sri Lankan MP
- Sri Lankan MP Namal Rajapaksa
- Sri Lankan MP Namal Rajapaksa visits Ayodhya Ram Mandir
- Ayodhya Ram temple
- Ram Mandir Ayodhya
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com