New Chief Ministers: నేడే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ సీఎంల ప్రమాణస్వీకారం

New Chief Ministers:  నేడే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ సీఎంల ప్రమాణస్వీకారం
మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా విష్ణు సాయి

నేడు రెండు రాష్ట్రాల్లో ప్రమాణస్వీకార కార్యక్రమాలు జరగనున్నాయి. మొదటగా, మధ్యప్రదేశ్‌కు కొత్తగా నియమితులైన మోహన్ యాదవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.మోహన్ యాదవ్ భోపాల్ నగరంలోని లాల్ పరేడ్ గ్రౌండులో , రాయపూర్ నగరంలోని సైన్స్ కళాశాల మైదానంలో విష్ణు సాయి ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.

రెండు రాష్ట్రాలో సీఎంల ప్రమాణస్వీకారోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పాల్గొననున్నారు. వీరితో పాటు మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎంలుగా రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరితోపాటు మాజీ కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకరుగా వ్యవహరించనున్నారు. ప్రధాని మోదీ, జేపీ నడ్డాల సమక్షంలో మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ చెప్పారు.

మధ్యప్రదేశ్ కొత్త సీఎం మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై మోహన్ యాదవ్ 12941 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మోహన్ యాదవ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు అత్యంత సన్నిహితుడు. శివరాజ్ సింగ్ ప్రభుత్వంలో మోహన్ యాదవ్ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. మోహన్ యాదవ్ 2013లో తొలిసారి ఉజ్జయిని సౌత్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మోహన్ యాదవ్ 1982లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సమయంలో మాధవ్ మహావిద్యాలయ స్టూడెంట్స్ యూనియన్ కో-సెక్రటరీగా ఎన్నికయ్యారు. దీని తరువాత, 1984 సంవత్సరంలో అతను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, ఉజ్జయిని నగర మంత్రిగా నియమించబడ్డాడు.

ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రి గిరిజన సమాజంలోని కన్వర్ తెగ నుండి వచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ తొలి గిరిజన సీఎం విష్ణుదేవ్‌ సాయి. కుంకూరి అసెంబ్లీ నుంచి సాయి విజయం సాధించారు. ఆయన 25 వేలకు పైగా ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ది మింజ్‌పై విజయం సాధించారు. విష్ణుదేవ్ సాయి రాయ్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మోడీ మంత్రివర్గంలో మంత్రిగా కూడా ఉన్నారు. సాయికి క్లీన్‌ ఇమేజ్‌ రావడంతో పార్టీ హైకమాండ్‌ ఆయనకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించింది. సంఘ్‌కి సన్నిహితంగా ఉండే నాయకులలో విష్ణుదేవ్ సాయి కూడా ఒకరు. రమణ్ సింగ్‌తో అతని సంబంధాలు కూడా చాలా మంచివి.

Tags

Read MoreRead Less
Next Story