మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ ప్రభుత్వానికి ఢోకా లేదు..

X
By - kasi |10 Nov 2020 5:09 PM IST
దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో కమలం వికసించింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మధ్యప్రదేశ్ లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోనుంది. 28 స్ఠానాలకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటికే 10 స్థానాలు కైవసం చేసుకోగా.. మరో 10 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. ఇక కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి ఓ స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ ఫలితాలతో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయి. బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా తన స్టామినా ఏంటో కాంగ్రెస్ కు రుచి చూపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com