Maha Kumbh Tragedy: ప్రయాగ్‌రాజ్‌ తొక్కిసలాటపై న్యాయ విచారణ

Maha Kumbh Tragedy: ప్రయాగ్‌రాజ్‌ తొక్కిసలాటపై న్యాయ విచారణ
X
మృతులకు రూ.25లక్షల పరిహారం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటనపై యోగి ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఇక మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది.

“ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నాం. న్యాయ కమిషన్ ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుంది. ఈ విషయంలో ప్రధాన కార్యదర్శి మరియు డీజీపీ స్వయంగా ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి, అవసరమైతే ఆ సమస్యలన్నింటినీ పరిశీలిస్తారు. ”అని యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.

బుధవారం తెల్లవారుజామున మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానం ఆచరించేందుక పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయితే ఒకే ప్రదేశంలో పెద్ద ఎత్తున భక్తులు గుంపు కూడి ఉన్నారు. అయితే బారికేడ్లు కొంత మంది బద్దలు కొట్టారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొని తొక్కిసలాటకు కారణమైంది. ఇక ఈ తొక్కిసలాటలో 30 మంది చనిపోగా.. 60 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే మృతుల్లో 25 మంది డెడ్‌బాడీలను గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ 35 మంది చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.

Tags

Next Story