New Delhi : మహాకూటమి మళ్లీ ఏర్పడనుందా..?

New Delhi : మహాకూటమి మళ్లీ ఏర్పడనుందా..?
New Delhi : మహాకుటమి ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వస్తుందా అంటే అవుననే సమాధానం వస్తోంది

New Delhi : మహాకుటమి ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వస్తుందా అంటే అవుననే సమాధానం వస్తోంది.వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ కానున్నారు ప్రతిపక్షాల ఐక్యతే అజెండాగా వీరు సమావేశం కానున్నట్లు సమాచారం.

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పక్షాలు ఏకం కావడానికి రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్నారు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్, కేసీఆర్ వంటి నేతలు. బీహార్ లో జేడీయూ-ఆర్జేడీ మహాకూటమిలాగే కేంద్రంలో మహాకూటమి ఏర్పాటు చేసే దిశలో ఉన్నారు నితీష్ కుమార్. ఇటీవల బీహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్.. సెప్టెంబర్ మొదటివారంలో మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎన్సీపీ నేత శరద్ పవార్, వామపక్షాల నేతలను కలుసుకున్నారు.

ఈవాళ నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ కాంగ్రెస్ చీఫ్‌ సోనియాగాంధీతో భేటీ కానున్నారు. దాదాపుగా ఐదేళ్ల తరువాత ఈ మూడు పార్టీల నాయకులు కలుసుకుంటున్నారు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ వ్యవస్థాపకుడు దివంగత చౌదరి దేవీలాల్ జయంతి సందర్భంగా నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీ వెళ్లారు. నితీష్ కుమార్ తో కలిసి సోనియాగాంధీని కలుస్తానని గతంలోనే లాలూ ప్రసాద్ యాదవ్‌ ప్రకటించారు.

2024 ఎన్నికలే టార్గెట్ గా మహాకూటమి ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతిపక్షాలు ఉన్నట్లు కనిపిస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసే పనిలో ఉన్నారు బీహార్ నేతలు. మరోవైపు దక్షిణాది నుంచి కేసీఆర్ కూడా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలని భావిస్తున్నారు. ఇటీవల బీహర్ వెళ్లిన సీఎం కేసీఆర్.. ఈ విషయంపై నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లతో చర్చించారు.

మరోవైపు సీఎం నితీష్ కుమార్ వచ్చే ఎన్నికల్లో పీఎం అభ్యర్థి అని ఆయన పార్టీ జేడీయూ కార్యకర్తలు బీహార్ వ్యాప్తంగా పోస్టర్లతో హోరెత్తిస్తున్నారు. ముగ్గురు విపక్ష నేతల మధ్య జరిగే సమావేశం జాతీయ రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది.

లాలూప్రసాద్‌ బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌తో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ప్రతిపక్షాల ఐక్యతే ప్రధాన అజెండా అని లాలూ తెలిపారు.మరోవైపు హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్‌ చౌతాలా ఆధ్వర్యంలో ఆదివారం జరిగే ర్యాలీకి బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ హాజరయ్యే అవకాశం ఉంది. మరికొందరు ప్రతిక్ష నేతలు ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story