Maharashtra Train Accident : మహారాష్ట్రలో రైలు ప్రమాదం.. పల్టీ కొట్టిన బోగీలు..
By - Divya Reddy |17 Aug 2022 4:43 AM GMT
Maharashtra Train Accident : మహారాష్ట్రంలోని గోందియా జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.
Maharashtra Train Accident : మహారాష్ట్రంలోని గోందియా జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 50 మంది వరకు ప్రయాణీకులు గాయపడ్డారు. ఛత్తీష్ గఢ్ బిలాస్ పూర్ నుంచి రాజస్థాన్ జోధ్ పూర్ కు వెళుతున్న భగత్ కీ కోఠీ ప్యాసింజర్ రైలు.. ఓ గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి.
ఈ ఘటనలో రైల్లో ఉన్న ప్రయాణీకులు గాయపడ్డారు. అర్ధరాత్రి 2గంటల 30నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com