Bihar Scam: గర్భవతులను చేస్తే రూ.10 లక్షలు..

Bihar Scam: గర్భవతులను చేస్తే రూ.10 లక్షలు..
X
బీహార్‌లో సరికొత్త స్కామ్, పోలీసులకు చిక్కిన ముఠా..

స్టాక్‌ మార్కెట్‌లో అధిక రాబడులు, అధిక వడ్డీ, డిజిటల్‌ అరెస్టులు, హనీట్రాప్‌ ఇలా ఎన్నో రకాలుగా సైబర్‌ నేరగాళ్లు విరుచుకుపడుతున్నారు. పోలీసులు ఎన్ని రకాలుగా అప్రమత్తం చేస్తున్నప్పటికీ సైబర్‌ నేరగాళ్లు ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే బిహార్‌లో ఏకంగా ఓ ముఠా.. సంతానం లేని స్త్రీలను గర్భవతులను చేస్తే భారీ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని ప్రకటనలు గుప్పించి బాధితుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసింది. ఈ తరహా మోసాలపై పోలీసులకు ఫిర్యాదులు అందడంతో దర్యాప్తు చేపట్టి ముఠా సభ్యులు పలువురిని అరెస్టు చేశారు. నవడా జిల్లాలో ఈ స్కామ్‌ బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఆల్‌ ఇండియా ప్రెగ్నెంట్‌ జాబ్‌ సర్వీస్‌’, ‘ప్లేబాయ్‌ సర్వీస్‌’ల పేరిట ఫేస్‌బుక్‌లో ఈ ముఠా సభ్యులు ప్రకటనలు ఇచ్చారు. పిల్లలు లేని స్త్రీలను గర్భవతులను చేస్తే రూ.10 లక్షలు పొందవచ్చని ప్రకటించారు. ఒకవేళ వారు విఫలమైతే రూ.50 వేల నుంచి రూ.5 లక్షలు సైతం పొందవచ్చని పేర్కొన్నారు. దీంతో ఆకర్షితులైన పలువురు ఆ ముఠాను సంప్రదించారు. మొదట ముఠా సభ్యులు బాధితుల నుంచి పాన్‌ కార్డ్‌, ఆధార్‌ కార్డ్‌, సెల్ఫీ, ఇతర వివరాలు సేకరించారు. అనంతరం రిజిస్ట్రేషన్‌, హోటల్‌ గదుల బుకింగ్స్‌ పేరిట డబ్బు వసూలు చేశారు. ఒకవేళ బాధితులు ఇవ్వకుంటే వారిని బ్లాక్‌మెయిల్‌ చేసేవారు. ఈ వ్యవహారమై ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అనంతరం నిందితులు ప్రిన్స్‌ రాజ్‌, భోలా కుమార్‌, రాహుల్‌ కుమార్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి 6 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద బాధితుల వాట్సప్‌ ఛాట్‌, కస్టమర్‌ ఫొటోలు, ఆడియో రికార్డింగ్‌లు, బ్యాంక్‌ లావాదేవీలను గుర్తించారు.

Tags

Next Story