ముంబై హీరా పన్నా మాల్లో భారీ అగ్నిప్రమాదం..
ముంబైలోని జోగేశ్వరిలోని హీరా పన్నా మాల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ముంబయి అగ్నిమాపక దళం అధికారులు దీనిని మూడో స్థాయి అగ్నిప్రమాదంగా ప్రకటించారు.
ముంబైలోని జోగేశ్వరి ప్రాంతంలోని హీరా పన్నా అనే షాపింగ్ మాల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ప్రకారం, మధ్యాహ్నం 3:15 గంటలకు మంటలు చెలరేగాయి. నివేదికల ప్రకారం, కొంతమంది మాల్లో చిక్కుకుని ఉండవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, షాపింగ్ కాంప్లెక్స్ను వెంటనే ఖాళీ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.
12 ఫైర్ ఇంజన్లతో సహా 25 ఫైర్ బ్రిగేడ్ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి..
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com