MODI: బ్రాండ్ మోదీ: చెరగని ముద్ర

MODI: బ్రాండ్ మోదీ: చెరగని ముద్ర
X
స్పష్టం చేసిన 'మూ­డ్ ఆఫ్ ది నే­ష­న్' సర్వే

దేశ రా­జ­కీయ యవ­ని­క­పై ప్ర­ధా­ని మోదీ నా­య­క­త్వం­లో­ని ఎన్డీ­యే కూ­ట­మి బలం రో­జు­రో­జు­కూ పె­రు­గు­తోం­ద­ని 'మూ­డ్ ఆఫ్ ది నే­ష­న్' సర్వే స్ప­ష్టం చే­సిం­ది. ఇం­డి­యా టుడే, సీ ఓటర్ సం­యు­క్తం­గా ని­ర్వ­హిం­చిన ఈ తాజా సర్వే­లో ప్ర­ధా­ని మోదీ పట్ల దేశ ప్ర­జ­ల్లో ఉన్న ఆదరణ ఏమా­త్రం తగ్గ­లే­ద­ని వె­ల్ల­డైం­ది. గత ఎని­మి­ది వా­రాల కా­లం­లో దే­శ­వ్యా­ప్తం­గా సు­మా­రు 1.25 లక్షల మంది అభి­ప్రా­యా­ల­ను సే­క­రిం­చి గు­రు­వా­రం ఈ ఫలి­తా­ల­ను వి­డు­దల చే­శా­రు. ఒక­వేళ దే­శం­లో ఇప్పు­డు ఎన్ని­క­లు జరి­గి­తే అధి­కార కూ­ట­మి­కి ప్ర­జ­లు గతం­లో కంటే ఎక్కువ స్థా­యి­లో బ్ర­హ్మ­ర­థం పడ­తా­ర­ని ఈ గణాం­కా­లు చె­బు­తు­న్నా­యి. గత కొ­న్ని నె­ల­లు­గా ప్ర­భు­త్వం తీ­సు­కుం­టు­న్న సా­హ­సో­పేత ని­ర్ణ­యా­లు ప్ర­జ­ల్లో నమ్మ­కా­న్ని రె­ట్టిం­పు చే­శా­య­ని ఈ సర్వే వి­శ్లే­షిం­చిం­ది. ఈ సర్వే అం­చ­నాల ప్ర­కా­రం లో­క్‌­స­భ­కు ఇప్ప­టి­కి­ప్పు­డు ఎన్ని­క­లు ని­ర్వ­హి­స్తే ఎన్డీ­యే కూ­ట­మి ఏకం­గా 352 స్థా­నా­ల­ను కై­వ­సం చే­సు­కు­నే అవ­కా­శం ఉంది. 2024 ఎన్ని­క­ల్లో ఈ కూ­ట­మి సొం­తం­గా మె­జా­రి­టీ మా­ర్కు­ను అం­దు­కో­వ­డం­లో ఒడి­దు­డు­కు­లు ఎదు­ర్కొ­న్న­ప్ప­టి­కీ, పూ­ర్తి అను­కూ­లం­గా మా­రా­యి. గత ఎన్ని­క­ల్లో 240 సీ­ట్ల­కే పరి­మి­త­మైన బీ­జే­పీ, ఇప్పు­డు తన బలా­న్ని పుం­జు­కు­ని ఒం­ట­రి­గా­నే 287 స్థా­నా­ల్లో వి­జ­యం సా­ధిం­చి సం­పూ­ర్ణ మె­జా­రి­టీ సా­ధి­స్తుం­ద­ని సర్వే ని­వే­దిక తే­ల్చిం­ది. అంటే మి­త్ర­ప­క్షాల మద్ద­తు లే­కుం­డా­నే బీ­జే­పీ ప్ర­భు­త్వా­న్ని ఏర్పా­టు చేసే స్థా­యి­కి చే­రు­కుం­ద­ని ఈ గణాం­కా­లు స్ప­ష్టం చే­స్తు­న్నా­యి. మోదీ ప్ర­భు­త్వం అమలు చే­స్తు­న్న సం­క్షేమ పథ­కా­లు, అం­త­ర్జా­తీయ వే­ది­క­ల­పై భారత ప్ర­తి­ష్ట పె­ర­గ­డం వంటి అం­శా­లు బీ­జే­పీ­కి కలి­సి­వ­స్తు­న్నా­యి.

మరో­వై­పు ప్ర­తి­ప­క్ష 'ఇం­డి­యా' కూ­ట­మి పరి­స్థి­తి ఆశా­జ­న­కం­గా ఏమీ లే­ద­ని సర్వే ఫలి­తా­లు సూ­చి­స్తు­న్నా­యి. దే­శ­వ్యా­ప్త పవ­నాల ప్ర­భా­వం­తో ప్ర­తి­ప­క్ష కూ­ట­మి కే­వ­లం 182 సీ­ట్ల వద్దే ఆగి­పో­తుం­ద­ని వె­ల్ల­డైం­ది. ప్ర­ధా­ని మోదీ చరి­ష్మా, సు­స్థిర పాలన పట్ల ప్ర­జ­లు చూ­పి­స్తు­న్న మొ­గ్గు ప్ర­తి­ప­క్షాల వ్యూ­హా­ల­ను దె­బ్బ­తీ­స్తు­న్న­ట్లు కని­పి­స్తోం­ది. ము­ఖ్యం­గా యువత, మహి­ళా ఓట­ర్ల­లో మో­దీ­పై ఉన్న నమ్మ­కం ఎన్డీ­యే­కు శ్రీ­రా­మ­ర­క్ష­గా మా­రు­తోం­ద­ని ఈ సర్వే వి­శ్లే­షిం­చిం­ది. కే­వ­లం ప్రాం­తీయ పా­ర్టీ­లు బలం­గా ఉన్న రా­ష్ట్రా­ల్లో­నే ప్ర­తి­ప­క్షా­లు కొంత మే­ర­కు ప్ర­భా­వం చూ­ప­గ­ల­వ­ని, జా­తీయ స్థా­యి­లో మా­త్రం మో­దీ­కి ప్ర­త్యా­మ్నా­యం లే­ద­ని మె­జా­రి­టీ ప్ర­జ­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు. ఆర్థిక సం­స్క­ర­ణ­లు, ఉపా­ధి కల్పన వంటి అం­శా­ల్లో ప్ర­జల ఆశ­ల­ను అం­దు­కో­వ­డం­లో ప్ర­భు­త్వం సఫ­ల­మైం­ద­ని ఈ సర్వే ఫలి­తా­లు ని­రూ­పి­స్తు­న్నా­యి.

Tags

Next Story