MODI: చిరస్మరణీయ సంవత్సరం: ప్రధాని మోదీ

MODI: చిరస్మరణీయ సంవత్సరం: ప్రధాని మోదీ
X
ఆపరేషన్ సిందూర్‌ నుంచి టెక్నాలజీ వరకు ... ఆపరేషన్ కగార్ నుంచి ఐసీసీ ట్రోఫీలు .. కుంభమేళ, అయోధ్య, నరసాపురం

ప్ర­ధా­ని నరేం­ద్ర మోదీ ఆది­వా­రం, డి­సెం­బ­ర్ 28 ని­ర్వ­హిం­చిన ఈ ఏడా­ది చి­వ­రి మన్ కీ బాత్ కా­ర్య­క్ర­మం­లో దేశ ప్ర­జ­ల­ను­ద్ధే­శిం­చి ప్ర­సం­గిం­చా­రు. 129వ మన్ కీ బా­త్‌­లో 2025 సం­వ­త్స­రం­లో భా­ర­త­దే­శం సా­ధిం­చిన విజయ క్ష­ణా­ల­ను ప్ర­ధా­ని గు­ర్తు­చే­సు­కు­న్నా­రు. ము­ఖ్యం­గా ఆప­రే­ష­న్ సిం­దూ­ర్‌­ను మా­రు­తు­న్న భా­ర­తా­వ­ని­గా అభి­వ­ర్ణిం­చి, సై­నిక వి­జ­యా­న్ని దే­శ­వ్యా­ప్త దే­శ­భ­క్తి­ని పెం­చిన ఘట­న­గా ప్ర­ధా­ని ప్ర­శం­సిం­చా­రు. ఈ ఏడా­ది భా­ర­త్.. ఉగ్ర­వా­దా­ని­కి వ్య­తి­రే­కం­గా చూ­పిన ధై­ర్యం, స్వ­దే­శీ ఆయు­ధా­లు, టె­క్నా­ల­జీ ఉప­యో­గం ద్వా­రా సా­ధిం­చిన వి­జ­యా­ల­ను మోదీ ప్ర­శం­సిం­చా­రు. ఆప­రే­ష­న్ సిం­దూ­ర్ ద్వా­రా దేశం ఉగ్ర­వా­దా­న్ని రూ­పు­మా­పే ని­ర్ణ­యా­న్ని చా­టిం­ద­ని, ఇది కే­వ­లం సై­నిక చర్య కాదు.. మా­రు­తు­న్న భా­ర­త్ బలా­న్ని ప్ర­తి­బిం­బి­స్తుం­ద­ని అన్నా­రు. అం­తే­కా­కుం­డా, గిర్ అడ­వు­ల్లో ఆసి­యా­టి­క్ సిం­హాల సం­ఖ్య పె­రు­గు­దల, మా­వో­యి­స్ట్ ప్ర­భా­విత ప్రాం­తా­ల్లో అభి­వృ­ద్ధి, మహి­ళా సా­ధి­కా­రత వంటి అం­శా­ల­ను కూడా ప్ర­ధా­ని ప్ర­స్తా­విం­చా­రు. వో­క­ల్ ఫర్ లో­క­ల్‌­ను మరింత బలో­పే­తం చే­యా­ల­ని, దే­శీయ ఉత్ప­త్తు­ల­ను ప్రో­త్స­హిం­చా­ల­ని ప్ర­ధా­ని పి­లు­పు­ని­చ్చా­రు.

క్రీ­డల పరం­గా కూడా ఈ ఏడా­ది చి­ర­స్మ­ర­ణీ­య­మ­ని­మో­దీ పే­ర్కొ­న్నా­రు. 12 ఏళ్ల తర్వాత టీ­మిం­డి­యా పు­రు­షుల క్రి­కె­ట్ జట్టు ఐసీ­సీ ఛాం­పి­య­న్స్ ట్రో­ఫీ­ని సొం­తం చే­సు­కుం­ద­ని.. మహి­ళల క్రి­కె­ట్ జట్టు మొ­ద­టి­సా­రి వన్డే ప్ర­పంచ కప్‌­ను గె­లు­చు­కుం­ద­న్నా­రు. మహి­ళల అం­ధుల జట్టు టీ20 ప్ర­పంచ కప్‌­ను గె­లు­చు­కొ­ని చరి­త్ర సృ­ష్టిం­చిం­ద­ని గు­ర్తు చే­సు­కు­న్నా­రు. అం­త­రి­క్ష రం­గం­లో­నూ ఈ ఏడా­ది భా­ర­త్‌ తన ప్ర­తి­భ­ను చా­టు­కుం­ద­ని అన్నా­రు. ఈ సం­ద­ర్భం­గా అం­త­ర్జా­తీయ అం­త­రి­క్ష కేం­ద్రా­ని­కి చే­రు­కు­న్న తొలి భా­ర­తీ­యు­డి­గా చరి­త్ర సృ­ష్టిం­చిన శు­భా­న్షు శు­క్లా­ను ప్ర­శం­సిం­చా­రు. శుబాన్షు శుక్లా భారత కీర్తి పతాకను రెపరెపలాడించారన్నారు.

కో­ట్ల మంది పా­ల్గొ­న్న మహా కుం­భ­మే­ళా­ను ది­గ్వి­జ­యం­గా ని­ర్వ­హిం­చి భా­ర­త్‌ ప్ర­పంచ దే­శా­ల­ను ఆశ్చ­ర్య­ప­రి­చిం­ద­ని మోదీ పే­ర్కొ­న్నా­రు. అయో­ధ్య రా­మా­ల­యం­లో జరి­గిన ధ్వ­జా­రో­హణ కా­ర్య­క్ర­మం ప్ర­తి హిం­దు­వు గర్వ­ప­డే­లా చే­సిం­ద­ని అభి­ప్రా­య­ప­డ్డా­రు. ఈ ఏడా­ది­లో ప్ర­భు­త్వం చే­ప­ట్టిన అనేక పథ­కా­లు, ఇతర వి­ష­యా­ల­ను గు­ర్తు చే­సు­కు­న్నా­రు. 2025లో దేశ ప్ర­జ­లు ఏ వి­ధం­గా ఐక్య­త­తో సా­మ­ర­స్యం­గా ఉన్నా­రో అదే వి­ధం­గా కొ­త్త సం­వ­త్స­రం­లో­కి అడు­గు­పె­ట్టా­ల­ని పి­లు­పు­ని­చ్చా­రు. నూతన సం­వ­త్స­రం­లో దే­శా­భి­వృ­ద్ధి కోసం తమ ప్ర­భు­త్వం మరి­న్ని చర్య­లు తీ­సు­కుం­టుం­ద­ని హామీ ఇచ్చా­రు. భా­ర­త్ ఉగ్ర­వా­దా­న్ని ఎదు­ర్కొ­వ­డం­లో చూ­పిన ధై­ర్యం, స్వ­దే­శీ ఆయుధ సం­ప­త్తి, టె­క్నా­ల­జీ ఉప­యో­గం ద్వా­రా సా­ధిం­చిన వి­జ­యా­ల­ను మోదీ గు­ర్తు చే­సు­కు­న్నా­రు. ఆప­రే­ష­న్ సిం­దూ­ర్ తో దేశం ఉగ్ర­వా­దా­న్ని రూ­పు­మా­పే ని­ర్ణ­యా­న్ని చా­టిం­ద­న్నా­రు. ఇది కే­వ­లం సై­నిక చర్య మా­త్ర­మే కాదు.. మా­రు­తు­న్న భా­ర­త్ బలా­న్ని ప్ర­తి­బిం­బి­స్తుం­ద­ని అన్నా­రు. . వో­క­ల్ ఫర్ లో­క­ల్‌­ను మరింత బలో­పే­తం చే­యా­ల­న్నా­రు.

మోదీ నరసాపురం లేస్‌ క్రాఫ్ట్‌ మాట..

మన్‌­కీ­బా­త్‌­లో ప్ర­ధా­ని మా­ట్లా­డు­తూ నర­సా­పు­రం లే­స్‌ క్రా­ఫ్ట్‌ గు­రిం­చి ప్ర­స్తా­విం­చా­రు. ప్ర­స్తుత మా­ర్కె­ట్‌­లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో­ని నర­సా­పు­రం­లో లే­స్‌ క్రా­ఫ్ట్‌ చర్చ­నీ­యాం­శం­గా మా­రిం­ద­న్నా­రు. తర­త­రాల నుం­చి మహి­ళ­లే ఈ అరు­దైన కళను కా­పా­డు­తూ వస్తు­న్నా­ర­న్నా­రు. ఏపీ ప్ర­భు­త్వం నా­బా­ర్డ్‌­తో కలి­సి లే­స్‌ క్రా­ఫ్ట్‌ కళా­కా­రు­ల­కు కొ­త్త డి­జై­న్లు, నై­పు­ణ్యా­లు నే­ర్పి­స్తోం­ద­ని.. ప్ర­స్తు­తం దీని మా­ర్కె­ట్‌ వే­గం­గా వి­స్త­రి­స్తోం­ద­న్నా­రు. ప్ర­భు­త్వ మద్ద­తు­తో నర­సా­పు­రం ప్ర­జ­లు ఈ కళకు కొ­త్త హం­గు­ల­ను చే­ర్చి ముం­దు­కు తీ­సు­కె­ళ్తు­న్నా­ర­ని ప్ర­శం­సిం­చా­రు. లక్ష­ల­మం­ది మహి­ళ­లు ఉపా­ధి పొం­దు­తు­న్న ఈ కళకు జీఐ గు­ర్తిం­పు కూడా ఉం­ద­న్నా­రు.

Tags

Next Story