Maharashtra: 2026 అక్టోబరు 31 నుంచి సింహస్థ కుంభమేళా..

గోదావరి జన్మస్థలం నాసిక్-త్రయంబకేశ్వర్ వద్ద ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే సింహస్థ కుంభమేళా షెడ్యూల్ వెలువడింది. 2026 అక్టోబరు 31న త్రయంబకేశ్వర్, నాసిక్లోని రామ్కుండ్లో ధ్వజారోహణతో క్రతువు ప్రారంభం కానుంది. 2027 ఆగస్టు 2న తొలి అమృత స్నానం, అదే నెల 31న రెండో స్నానం, సెప్టెంబరు 11న మూడో స్నానం.. 2028 జులై 24న కుంభమేళా ముగియనుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన నాసిక్లో జరిగిన సాధువులు, మహంతుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ సమావేశంలో 13 ప్రధాన అఖాడాల అధిపతులు, పురోహిత సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటీవలే ప్రయాగ్రాజ్లో 144 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహాకుంభమేళా ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
సింహస్థ కుంభమేళాకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయనున్నట్లు మహారాష్ట్ర సీఎం వెల్లడించారు. దాదాపు రూ.6000 కోట్లతో అభివృద్ధి పనులకు టెండర్లను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ‘ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా దీనిని తీర్చిదిద్దుతాం.. ఇప్పటికే రూ.4,000 కోట్ల పనులకు టెండర్లు పిలిచాం.. త్వరలో మరో రూ.2,000 కోట్ల పనులకు టెండర్లు వేయనున్నాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే అహల్యాబాయి హోల్కర్ జన్మస్థలమైన చౌండీ అభివృద్ధికి రూ.681 కోట్లు విడుదల చేస్తామని కూడా ఫడ్నవీస్ ప్రకటించారు. ఆమె నిర్మించిన ఘాట్ల పరిరక్షణకు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు.
ప్రధానంగా గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచేందుకు సెవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా చర్యలు చేపడతామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. “గతం కుంభమేళాల్లో చోటుచేసుకున్న తప్పిదాలను పునరావృతం చేయకుండా, ఈసారి పూర్తి సమయాన్ని వినియోగించుకుంటున్నాం’ అని ఫడ్నవీస్ చెప్పారు. నాసిక్, త్రయంబకేశ్వర్ పరిధిలో కాంక్రీటు రహదారులు, కుషావర్త ఘాట్ వద్ద గిరిజన స్థలంలో భద్రతా ఏర్పాట్లు, భారీ జనసందోహ నిర్వహణ ప్రణాళికలు అమలు అవుతున్నట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com