BJP: ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం

ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం జరగనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల ఇన్ఛార్జ్లు, మోర్చాల అధ్యక్షులు, ఇన్ఛార్జ్లతో జేపీ నడ్డా, అమిత్ షా, బి.ఎల్. సంతోష్ సహా కీలక నేతలు సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలు, 2024 సార్వత్రిక ఎన్నికలు,5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చించనున్నారు. బీజేపీ సెంట్రల్ ఆఫీస్లో సాయంత్రం వరకు రెండు దఫాలుగా సమావేశం కొనసాగనుంది. మొదటగా జాతీయ ప్రధాన కార్యదర్శులతో, తర్వాత మోర్చాల అధ్యక్షులతో పార్టీ పరిస్థితులపై అధిష్టాన పెద్దలు చర్చించనున్నారు. మోడీ ప్రభుత్వానికి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ చేపట్టిన మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంపై అధిష్టాన పెద్దలకు నివేదిక అందించనున్నారు. ఎన్నికలు జరగనున్న తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలో పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యచరణపై నేతలకు బీజేపీ పెద్దలు దిశానిర్దేశం చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com