మహిళలు, చిన్నారులపై అత్యాచార ఘటనలపై NCRB సంచలన నివేదిక

మహిళలు, చిన్నారులపై అత్యాచార ఘటనలపై NCRB సంచలన నివేదిక

భారత్‌లో మహిళలు, చిన్నారులపై అత్యాచార ఘటనలపై నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో సంచలన నివేదిక వెల్లడించింది. దేశంలో ప్రతి 16 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుందని తెలిపింది. మహిళలు, బాలికలకు ఏ రాష్ట్రంలోనూ రక్షణ లేదని NCRB తెలిపింది. 2018తో పోలిస్తే... 2019లో మహిళలపై 7.3 శాతం అఘాయిత్యాలు పెరిగాయని తెలిపింది. గతేడాది దేశవ్యాప్తంగా 4 లక్షల 5 వేల 861 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఇక నేరాల్లో ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని NCRB తెలిపింది.

Tags

Next Story