Shashi Tharoor : యోగా కోసం కృషి చేసిన వారికి గుర్తింపు దక్కాలి
ప్రపంచమంతా యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. భారత దేశ వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు.
యోగా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా భారత ప్రజలకు యోగా శుభాకాంక్షలు తెలిపింది. కాంఅని, ఆయన శీర్షాసనం యోగా చేస్తున్న ఫోటోను జతచేసింది.
"యోగాకు గుర్తింపు తీసుకురావాలన్న తాపత్రయంతో యోగాను జాతీయ విధానాల్లో చేర్చిన నెహ్రూ గారికి కృతఙ్ఞతలు. మన శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి ఎంతగానో తోడ్పడే ఈ ప్రాచీన విద్యను అందరం ఆచరిద్దాం." - కాంగ్రెస్ ట్వీట్
కాంగ్రెస్ చేసిన ట్వీట్ను ట్యాగ్ చేస్తూ ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ ఇలా ట్వీట్ చేశారు..”యోగాకు ప్రాముఖ్యత తెచ్చేందుకు ఆది నుంచి కృషి చేసిన వారితో పాటు అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందేందుకు తోడ్పడిన భారత ప్రభుత్వం, యోగాకు ఇంతటి ప్రాచుర్యం కల్పించిన ప్రతి ఒక్కరికీ ఈ గుర్తింపు దక్కాలి. యోగా మనలోని అంతర్గత శక్తిని ఉత్తేజింప చేస్తుందని దశాబ్దాలుగా నేను వాదిస్తూనే ఉన్నాను. ఐక్యరాజ్యసమితి ద్వారా యోగా ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేయడం గొప్ప విషయం." అని రాశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com