పాకిస్తాన్ దుశ్చర్య : ఆరుగురు మృతి

X
By - kasi |13 Nov 2020 5:23 PM IST
జమ్ముకాశ్మీర్ బారాముల్లా జిల్లాలో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. LOC బోర్డర్ వెంబడి పాక్ సైన్యం జరుపుతున్న కాల్పుల్లో నలుగురు పౌరులు, ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతిచెందారు. మృతుల్లో బీఎస్ఎఫ్ అధికారి రాకేష్ దోవల్ ఉన్నారు. పాక్ సైన్యం కాల్పులను భారత్ ఆర్మీ బలంగా తిప్పికొడుతుంది. భారత్ ఆర్మీ కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు మృతిచెందారు. ఉగ్రవాదులను భారత్ లోకి పంపించేందుకు పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com