Sudarshan Setu: సుదర్శన్ సేతు ప్రత్యేకతలివి

Sudarshan Setu: సుదర్శన్ సేతు ప్రత్యేకతలివి
దేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జి .. అంతే కాదు

సుదర్శన్ సేతు .. ఈ వంతెన భారతదేశపు అతి పొడవైన కేబుల్ సపోర్ట్ బ్రిడ్జ్. . దీని ఫుట్‌పాత్ పై భాగంలో సౌర ఫలకాలను అమర్చారు. ఈ సోలార్ ప్యానెల్స్ 1 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వంతెన నిర్మాణానికి 2017 అక్టోబర్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. 27.20 మీటర్ల వెడల్పుతో, 2.3 కిలోమీటర్ల పొడవు, నాలుగు లేన్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జ్‌కు ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పైన ఫుట్‌పాత్‌లు కూడా ఉన్నాయి. సుదర్శన్‌ సేతును ఒక ప్రత్యేకమైన డిజైన్‌తో నిర్మించారు. బ్రిడ్జ్‌ ఇరువైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంచారు.


ఈ వంతెన నాలుగు లేన్లు, రెండు వైపులా 2.50 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు నిర్మించారు. ఈ వంతెన చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది సందర్శించే పర్యాటకులందరికీ కేంద్రంగా ఉంటుంది. వంతెనపై అద్భుతమైన కళాఖండాలు కనిపిస్తాయి. సుదర్శన్ వంతెన శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. దాని కాలిబాటను భగవద్గీతలోని శ్లోకాలు, శ్రీ కృష్ణుడి చిత్రాలతో అలంకరించారు. సుదర్శన్ సేతు 2.32 కిలోమీటర్ల పొడవుతో ఇప్పటివరకు భారతదేశంలోనే అతి పొడవైన కేబుల్ సపోర్టెడ్ వంతెన. ఈ వంతెన నిర్మాణానికి మొత్తం రూ.980 కోట్లు ఖర్చు చేశారు. ఈ వంతెన ఓఖా ప్రధాన భూభాగాన్ని, బెట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతుంది.

Tags

Read MoreRead Less
Next Story