PM Modi: నేడు అహ్మదాబాద్కు ప్రధాని మోడీ..

గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఉన్న ఒక్కరు మినహా 241 మంది మరణించారు. విమానంలో మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడిపోవడంతో మరో 24 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 265కు చేరింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా దుర్మరణం పాలయ్యారు. మహా విషాదం నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం అహ్మదాబాద్ వెళ్లనున్నారు. విమాన ప్రమాద స్థలిని పరిశీలించనున్నారు. ఈ మేరకు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది.
కాగా, ప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని హృదయ విదారక విషాదంగా అభివర్ణించారు. అహ్మదాబాద్లో పెను విషాదం తనను ఎంతగానో కలచివేసిందని, మాటలు రావడం లేదని చెప్పారు. ఇది మాటలకందని మహా విషాదమని, తన హృదయం ముక్కలైందని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనలన్నీ మృతుల కుటుంబాల గురించేనని తెలిపారు. ఈ ప్రమాదంలో బాధితులకు సహాయం అందించేందుకు అధికారులతో టచ్లో ఉంటున్నట్టు చెప్పారు. మరోవైపు ప్రదాద స్థలాన్ని ఎయిర్ ఇండియా ఎండీ, సీఈవో క్యాంప్బెల్ విల్సన్ పరిశీలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com