PM Modi: 9 వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని

దేశవ్యాప్తంగా 9 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. కొత్త రైళ్లలో తెలుగు రాష్ట్రాల నుంచి రెండు రైళ్లు ఉన్నాయి. హైదరాబాద్ -బెంగళూరు, విజయవా-చెన్నై మార్గాల్లో వందేభారత్ రైళ్లు నడనున్నాయి. ఈమేరకు ఆదివారం కాచిగూడ రైల్వే స్టేషన్ లో జరిగిన వందేభారత్ రైలు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లు దేశంలోని వివిధ నగరాల మధ్య సేవలందిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన మార్గాల్లో ఈ రైళ్లు తిరుగుతున్నాయి. ప్రజల నుంచి సైతం మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో మరిన్ని రూట్లకు చైర్కార్, స్లీపర్, మినీ వందే భారత్ రైళ్ల సర్వీస్లను విస్తరించాలని కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కార్ యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లు దేశంలోని వివిధ నగరాల మధ్య సేవలందిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన మార్గాల్లో ఈ రైళ్లు తిరుగుతున్నాయి. ప్రజల నుంచి సైతం మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో మరిన్ని రూట్లకు చైర్కార్, స్లీపర్, మినీ వందే భారత్ రైళ్ల సర్వీస్లను విస్తరించాలని కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కార్ యోచిస్తోంది.
ఇప్పటివరకు బ్లూ కలర్ లో వందే భారత్ రైళ్లు పట్టాలపైకి రాగా, ఈ సారి వచ్చేవి ఆరెంజ్ కలర్ లో ఉండనున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాచిగూడ యశ్వంత్ పూర్, విజయవాడ-చెన్నై వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపీ వర్చువల్ గా ప్రారంభించారు. కాచిగూడ వేదికగా జరిగిన ప్రారంభవోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్ – బెంగళూరు మధ్య పరుగులు పెట్టే వందే భారత్ రైలు ఉదయం 5.30 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరుతుంది. మహబూగ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్ పుర్ చేరుకుంటుంది. తిరిగి 2.40గంటలకు యశ్వంత్ పూర్ నుంచి బయలుదేరి రాత్రి 11.40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. బుధవారం మినహా ఇది ఆరు రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com