RAPIDX train: సిద్ధం అయిన ‘ర్యాపిడ్‌ఎక్స్‌’ రైళ్లు

RAPIDX train:  సిద్ధం అయిన ‘ర్యాపిడ్‌ఎక్స్‌’ రైళ్లు
X
ఢిల్లీ-మీరట్ మధ్య ప్రారంభించనున్న మోదీ

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తర్వాత కేంద్రం మరో ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్ట్‌‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. హైస్పీడ్ ప్రాంతీయ రైలు (ర్యాపిడ్‌ఎక్స్) పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమైంది. ప్రయాణికుల మెరుగైన సేవలందించేందుకు ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా దేశంలో తొలి ప్రాంతీయ హైస్పీడ్ రైలు సేవలు ఢిల్లీ-ఘజియాబాద్ మధ్య ప్రారంభమవుతాయి. గంటకు 160 కి.మీల వేగంతో నడిచే అధునాతన వసతులున్న ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ.. అక్టోబరు 20న ప్రారంభించనున్నారు. ఢిల్లీ- ఘజియాబాద్‌ రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ కారిడార్‌లో సాహిబాబాద్‌-దుహై డిపో మధ్య ఈ రైలు లాంఛనంగా నడుస్తుంది.

ఢిల్లీ- ఘజియాబాద్‌- మీరట్‌ రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ ప్రాజెక్టులో భాగంగా సాహిబాబాద్‌, దుహై డిపో మధ్య 17 కి.మీల ప్రాధాన్యత కలిగిన కారిడార్‌లో దేశంలోనే తొలి ర్యాపిడ్‌ఎక్స్‌ రైలుకు మోదీ పచ్చజెండా ఊపుతారు. సాహిబాబాద్ నుంచి దుహై డిపో మార్గంలో సాహిబాబాద్‌, ఘజియాబాద్‌, గుల్దర్‌, దుహై, దుహై డిపో స్టేషన్ల మీదుగా ఈ రైలు నడవనుంది.


పూర్తిస్థాయి ఎయిర్‌ కండిషన్డ్‌తో ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ర్యాపిడ్‌ఎక్స్ రైల్లో అధునాతన ఫీచర్లు ఏర్పాటు చేశారు. ప్రతి రైలులో 2×2 లేఅవుట్‌లో సీట్లు, నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, లగేజ్‌ ర్యాక్‌లు, సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ డోర్‌ వ్యవస్థ, ల్యాప్‌టాప్‌ లేదా మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్లు, డైనమిక్ రూట్‌ మ్యాప్‌లు, ఆటో కంట్రోల్ యాంబియంట్ లైటింగ్ సిస్టమ్, హీటింగ్ వెంటిలేషన్- ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ తో పాటు అనేక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

ఈ రైళ్ళు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య ప్రతి 15 నిమిషాలకు ఒకటి చొప్పున సర్వీసులందిస్తాయి. ఆరు కోచ్‌లు ఉండే ఈ రైలులో. ఏకకాలంలో 1700 మంది కూర్చొని, నిలబడి ప్రయాణించవచ్చు. స్టాండర్డ్‌ కోచ్‌లో 72 సీట్లు, ప్రీమియం కోచ్‌లో 62 సీట్లు చొప్పున ఉంటాయి. ఇక, టిక్కెట్ ధరల విషయానికి వస్తే.. స్టాండర్డ్‌ కోచ్‌లలో కనీస టికెట్‌ రూ.20.. గరిష్ఠ ధర రూ.50గా నిర్ణయించారు. అలాగే, ప్రీమియం కోచ్‌లలో మినిమం టికెట్‌ ధర రూ.40. కాగా గరిష్ఠ ధర రూ.100.



ర్యాపిడ్‌ఎక్స్‌ రైలులో ఒక కోచ్‌ను మహిళల కోసం ప్రత్యేకంగా కేటాంచారు. దీనిని ప్రీమియం కోచ్‌ పక్కనే ఉండేలా ఏర్పాటు చేశారు. ఇక ప్రీమియం కోచ్‌లో వెనుకకు వాలి కూర్చొనేలా సీట్లతో కోట్ హుక్స్, మ్యాగజైన్ హోల్డర్‌లు, ఫుట్‌రెస్ట్‌లు వంటి అదనపు సదుపాయాలు ఉన్నాయి. మీరట్‌ నుంచి ఢిల్లీకి వెళ్లే రైలులో తొలి కోచ్‌, ఢిల్లీ నుంచి మీరట్‌ వెళ్లే రైలులో ఆఖరి కోచ్‌ ప్రీమియం బోగీలు. ప్రీమియం కోచ్‌లోకి ఎక్కేందుకు ప్లాట్‌ఫాంపై ప్రత్యేక టారు.

Next Story