NIA Raids : జమ్మూ కాశ్మీర్ లో NIA దాడులు

NIA Raids : జమ్మూ కాశ్మీర్ లో NIA దాడులు

జమ్మూకాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు నిర్వహిస్తోంది. పాకిస్థాన్ కమాండర్లు, హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు వివిధ నకిలీ పేర్లతో పనిచేస్తున్న వారిని పట్టుకోవడానికి దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శ్రీనగర్, అనంత్‌నాగ్, కుప్వారా, పూంచ్, రాజౌరి, కిష్త్వార్ జిల్లాల్లో ఈ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మే 5న రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన కొన్ని రోజుల తర్వాత NIA దాడులు చేసింది. అంతకు ముందు ఏప్రిల్ 20న పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. ఆర్మీ వాహనం పూంచ్ జిల్లాలోని భింబర్ గలి నుంచి సాంగ్యోట్‌కు వెళుతుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారని రక్షణ అధికారులు తెలిపారు. రాజౌరి, పూంచ్ సెక్టార్ల చుట్టూ ఉన్న POKలోని లంజోట్, నికైల్, కోట్లి, ఖుయిరట్టాలో తీవ్రవాద కదలికలు ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

Tags

Read MoreRead Less
Next Story