Kupwara: కుప్వారాలో ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం.. కొనసాగుతోన్నసెర్చ్ ఆపరేషన్..

Kupwara: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతలో భద్రతా బలగాలు మరో ముందడుగు వేశాయి. ఇవాళ ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్లో ఇప్పటివరకు మొత్తం నలుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. సంఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు జవాన్లు.
ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. కుప్వారాలోని లోలాబ్ ప్రాంతంలో ఉగ్రవాది షౌకత్ అహ్మద్ షేక్ను అరెస్ట్ చేశారు. అతని నుంచి రాబట్టిన సమాచారంతో.. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించారు. దీంతో బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరుపడంతో నలుగురు మృతి చెందారు.
హతమైన ఉగ్రవాదుల్లో పాక్కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాది షౌకత్ అహ్మద్ షేక్ సైతం ఉన్నట్లు చెప్పారు. కుల్గామ్ జిల్లా దమ్హాల్ హంజిపోరా ప్రాంతంలో గుజ్జర్పోరా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకోగా.. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులను కుల్గామ్కు చెందిన జాకీర్ పదార్, శ్రీనగర్కు చెందిన షరీఫ్గా గుర్తించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com