Delhi: ముగిసిన పవన్‌ కల్యాణ్‌ పర్యటన

Delhi: ముగిసిన పవన్‌ కల్యాణ్‌ పర్యటన
నడ్డా నివాసంలో విస్తృత చర్చలు జరిగాయంటూ పవన్‌ ట్వీట్‌

ఢిల్లీలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పర్యటన ముగిసింది. ఏపీకి తిరిగి రావడానికి ముందు బీజేపీ అధ్యక్షుడు నడ్డాను పవన్‌ కలిశారు. గంటపాటు నడ్డాతో చర్చలు జరిపారు. నడ్డా నివాసంలో విస్తృత చర్చలు జరిగాయంటూ పవన్‌ ట్వీట్‌ చేశారు. ఏపీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అనుసరించాల్సిన ప్రణాళికల గురించి నడ్డా, పవన్‌ చర్చించారంటూ జనసేన ప్రెస్‌నోట్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో పాలనాపరంగా నెలకొన్న పరిస్థితులతో పాటు తాజా రాజకీయాలపైనా నడ్డా, పవన్‌ చర్చించారని వెల్లడించింది.

ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన పవన్‌ కల్యాణ్‌కు.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఢిల్లీ పర్యటన ముగించుకుని స్పెషల్‌ ఫ్లైట్‌లో వచ్చిన ఆయనకు గ్రాండ్‌ వెల్కమ్‌ చెప్పారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో జనసేన నాయకులు, కార్యకర్తలతో కోలాహలం నెలకొంది. అభిమానులతో పవన్‌ సెల్ఫీలు దిగారు. అనంతరం రోడ్డు మార్గాన మంగళగిరి పార్టీ ఆఫీస్‌కు వెళ్లారు. కాసేపట్లో పవన్‌కల్యాణ్‌ సమక్షంలో.. జనసేనలో చేరనున్నారు ఆమంచి కృష్ణమోహర్‌ సోదరుడు స్వాములు.

Tags

Read MoreRead Less
Next Story