Prashant Kishor: సోనియాగాంధీతో ప్రశాంత్‌ కిషోర్‌ వరుస సమావేశాలు.. నాలుగు రోజుల్లో మూడుసార్లు..

Prashant Kishor: సోనియాగాంధీతో ప్రశాంత్‌ కిషోర్‌ వరుస సమావేశాలు.. నాలుగు రోజుల్లో మూడుసార్లు..
Prashant Kishor: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సమావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి

Prashant Kishor: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సమావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత నాలుగు రోజుల్లో మూడుసార్లు సోనియాతో చర్చలు జరిపారు పీకే. శనివారం, సోమవారం నాటి మీటింగ్‌లకు కొనసాగింపుగా ఇవాళ కూడా సోనియా-పీకే భేటీ కొనసాగుతోంది. సమావేశమైన ప్రతిసారి గంటల కొద్దీ మాట్లాడుకుంటున్నారు. సోనియా-ప్రశాంత్‌ కిషోర్ సమావేశాల్లో కాంగ్రెస్‌ సీనియర్ నేతలు దిగ్విజయ్‌ సింగ్, కమల్‌నాథ్‌ కూడా పాల్గొంటున్నారు.

2024 ఎన్నికలకు కాంగ్రెస్‌ సన్నద్దత, అందుకోసం చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రజెంటేషన్‌పైనా, ఒకవేళ పార్టీలో చేరితే ప్రశాంత్‌ కిషోర్‌కు ఎలాంటి పాత్ర ఉండాలన్న దానిపైనా అధ్యయనం చేయడానికి ముకుల్ వాస్నిక్‌, దిగ్విజయ్‌ సింగ్, రణ్‌దీప్‌ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌తో కమిటీ ఏర్పాటు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story