Prashant Kishor: కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన ప్రశాంత్ కిశోర్

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. 'జన్ సురాజ్ పార్టీ' పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ పార్టీ రెండేళ్లుగా క్రియాశీలకంగా ఉందని, ఎన్నికల సంఘం నుంచి ఆమోదం పొందినట్లు చెప్పారు. బీహార్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించామని, అయితే ఈ పార్టీ నాయకత్వం మాత్రం తన చేతుల్లో లేదన్నారు. రెండేళ్లుగా ఈ పార్టీ కోసం శ్రమించిన వారే నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
బీహార్లో 30 ఏళ్లుగా ఆర్జేడీ, జేడీయూ, బీజేపీలకే ఓట్లు వేస్తు్న్నారని. ఆ సంప్రదాయం అంతం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ పార్టీ రాజవంశానికి చెందినది కాదని తెలిపారు. జన్ సురాజ్ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించినట్లు తెలిపారు. బీజేపీతో కలిసి పని చేసేందుకు పార్టీ ఏర్పాటు చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఇక మద్యపాన నిషేధాన్ని రద్దు చేస్తామని చెప్పారు. అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తోందని స్పష్టం చేశారు. పార్టీకి ఇండియన్ ఫారిన్ సర్వీస్ రిటైర్డ్ అధికారి మనోజ్ భారతి నేతృత్వం వహిస్తారని వెల్లడించారు. అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని నిలిపివేస్తామని.. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్యా రంగాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com