సురినామ్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న రాష్ట్రపతి

సురినామ్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న రాష్ట్రపతి
సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం "గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ది ఎల్లో స్టార్"ని అందుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం "గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ది ఎల్లో స్టార్"ని అందుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ గుర్తింపు కేవలం నాకు మాత్రమే కాదు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న 1.4 బిలియన్ల భారత ప్రజలదని అన్నారు. సురినాం-భారత్ రెండు దేశాల మధ్య సోదర సంబంధాలకు, రానున్న తరాలకు నేను ఈ గౌరవాన్ని అంకితం చేస్తున్నాను అంటూ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని రాష్ట్రపతి తెలియజేశారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సురినామ్, అత్యున్నత పౌర పురస్కారం అందడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ముర్ముకు శుభాకాంక్షలు తెలుపుతూ.. "సురినామ్, అత్యున్నత పౌర పురస్కారం "గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ది ఎల్లో స్టార్" పొందిన రాష్ట్రపతి జీకి అభినందనలు అంటూ మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. సురినాం, భారత్ ఈ రెండు దేశాల మధ్య శాశ్వతమైన స్నేహానికి ప్రతీకగా ఈ పురస్కారం నిలుస్తుంది" అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story