Robert Vadra : కంగనా రనౌత్ పై కస్సుమనటున్న రాబర్ట్ వాద్రా

కంగానాపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా నిప్పులు చెరిగారు. రైతుల నిరసనపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై మండి పడ్డారు. కంగనాకు పార్లమెంటులో ఉండే అర్హత లేదని ఆయన అన్నారు. జర్నలిస్టులతో మాట్లాడిన రాబర్ట్ వాద్రా.. ‘‘కంగనా ఓ మహిళ అని అన్నారు. నేను ఆమెను గౌరవిస్తాను. అయితే ఆమెకు పార్లమెంటులో ఉండే అర్హత లేదని నా అభిప్రాయం. ఆమె (కంగనా) చదువుకోలేదు. ఆమె ప్రజల గురించి ఆలోచించదని అనుకుంటున్నాను. ఆమె తన గురించి మాత్రమే ఆలోచిస్తుంది. స్త్రీల గురించి ఆలోచించాలి. మహిళల భద్రత విషయంలో దేశం మొత్తం ఏకతాటిపైకి రావాలని నా విజ్ఞప్తి. మహిళల భద్రత అత్యంత ప్రధానమైన అంశమని, దీనిని పరిష్కరించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని రాబర్ట్ వాద్రా అన్నారు.
హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ ఎంపీ కంగనా రనౌత్ సోమవారం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రైతుల ఉద్యమంలో సుదీర్ఘ ప్రణాళిక ఉందని అన్నారు. ఈ సమయంలో బంగ్లాదేశ్ వంటి పరిస్థితి భారతదేశంలో తలెత్తవచ్చు, కానీ దేశం బలమైన నాయకత్వం కారణంగా, అది జరగలేదు. రైతుల ఉద్యమంలో ప్రదర్శన పేరుతో హింస చెలరేగింది. అక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయని, మనుషులను చంపి ఉరి తీస్తున్నారని కంగనా అన్నారు. కంగనా చేసిన ఈ ప్రకటనపై పెద్ద దుమారమే రేగింది. కంగనా చేసిన ఈ వ్యాఖ్యపై కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష ఎంపీలు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల గురించి వ్యాఖ్యానించిన కంగనా కుల గణనపై కూడా ప్రకటన ఇచ్చింది.
దేశంలో కుల గణన జరగకూడదని అన్నారు. బీజేపీ ఎంపీల ఈ ప్రకటనతో వ్యవహారం హీటెక్కింది. ఈ విషయాలపై ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశాను. ఈ సమావేశంలో విధానపరమైన అంశాలపై మాట్లాడవద్దని నడ్డా కంగనాకు సూచించినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com