Assembly Elections 2023: ప్రియాంక గాంధీకి ఇసి నోటీసులు

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు చేసినందుకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాకు ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. మోదీపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు తమకు ఫిర్యాదు అందిందని, అందుకు సమాధానం చెప్పాలని ప్రియాంకు పంపిన ఆదేశాల్లో ఎన్నికల సంఘం పేర్కొంది.
అక్టోబర్ 30న సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఇద్దరినీ ఆదేశించింది. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా అక్టోబర్ 18న కవర్ధాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న హిమంత బిశ్వశర్మ.. ముస్లిం వర్గానికి చెందిన మంత్రి మహమ్మద్ అక్బర్ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్బర్ను సాగనంపకపోతే కౌశల్య మాతకు జన్మనిచ్చిన ఈ నేల అపవిత్రమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఏదైనా ప్రాంతానికి ఒక అక్బర్ వస్తే.. అతడు మరో వంద మంది అక్బర్లను తెస్తారని, అందుకే సాధ్యమైనంత త్వరగా అక్బర్ను సాగనంపాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు బుధవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ.. ప్రధాని నరేంద్ర మోడీపై పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో మోడీ గురించి అవాస్తవాలను ప్రచారం చేశారంటూ ఆ ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎవరైనా వ్యక్తిని మతం పేరుతోగానీ, వ్యక్తిగతంగా గానీ దూషించడం ఖచ్చితంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం కిందకే వస్తుందని పేర్కొన్న ఎన్నికల సంఘం.. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రియాంక గాంధీకి నోటీసులు ఇచ్చింది.

ప్రియాంకతో పాటూ ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల కు నోటీసులు జారీ చేసింది. నిర్ణీత గడువులోగా స్పందించకపోతే తగిన చర్య తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. "ఆప్ తన అధికారిక హ్యాండిల్ నుండి ఓ వీడియోను పోస్టు చేసింది. ఇందులో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ అధినేత గురించి చాలా అనైతికమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు" అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నవంబర్ 10న బీజేపీ ఎన్నికల కమిషన్ ని ఆశ్రయించింది. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అనైతిక వ్యాఖ్యలను పోస్ట్ చేసినందుకు ఆప్పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, పార్టీ జాతీయ మీడియా ఇన్ఛార్జ్, రాజ్యసభ ఎంపీ అనిల్ బలూనీ, పార్టీ నాయకుడు ఓం పాఠక్లతో కూడిన బీజేపీ ప్రతినిధి బృందం ఈ అంశంపై ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com