పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ రాజీనామా

X
By - Prasanna |3 Feb 2024 4:25 PM IST
పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ వ్యక్తిగత కారణాలతో శనివారం తన పదవికి రాజీనామా చేశారు.
పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ వ్యక్తిగత కారణాలతో శనివారం తన పదవికి రాజీనామా చేశారు. "నా వ్యక్తిగత కారణాలు మరియు కొన్ని ఇతర కట్టుబాట్ల కారణంగా, పంజాబ్ గవర్నర్ పదవికి మరియు చండీగఢ్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేటర్ పదవికి రాజీనామా చేస్తున్నాను" అని పురోహిత్ ఒక లేఖలో తెలిపారు.
పంజాబ్లోని అధికార ఆప్ ప్రభుత్వానికి పురోహిత్కు మధ్య వాగ్యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రాజీనామా చేయడం గమనార్హం. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఆయన ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు వరుస లేఖలు రాశారు.
నాగ్పూర్ నుండి మూడుసార్లు (కాంగ్రెస్ నుండి రెండుసార్లు మరియు ఒకసారి బిజెపి నుండి) ఎంపి అయిన పురోహిత్ గతంలో తమిళనాడు మరియు అస్సాం గవర్నర్గా పనిచేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com