పీవీ నరసింహారావు జయంతి.. నివాళులర్పించిన మోదీ, ఖర్గే
దివంగత ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం ఆయనకు నివాళులర్పించారు.
“పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాను. ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వం భారతదేశ అభివృద్ధికి తోడ్పడింది. మన దేశ ప్రగతికి ఆయన చేసిన అమూల్యమైన సేవలను మేము గౌరవిస్తున్నాము” అని ప్రధాని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.
ఖర్గే మాట్లాడుతూ, దివంగత అనుభవజ్ఞుడైన నాయకుడు "దేశ ఆర్థిక పరివర్తనకు తోడ్పడడంతో పాటు, దేశ నిర్మాణానికి చేసిన అద్భుతమైన సహకారం ఎల్లప్పుడూ ఆయనను గౌరవించుకునేలా చేసింది" అని అన్నారు.
జూన్ 28, 1921న తెలంగాణాలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించిన పీవీ 1991 నుండి 1996 వరకు పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన మొదటి వ్యక్తి. పీవీ ఆధ్వర్యంలో అప్పటి ఆర్థిక శాఖా మంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్ 1991లో ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చారు.
సింగ్కు తన నిర్ణయాలను అమలు చేయడానికి రాజకీయ రక్షణ కల్పించారు పీవీ. పీవీ నరసింహారావు డిసెంబర్ 23, 2004 న 81 సంవత్సరాల వయస్సులో మరణించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com