Rahul Gandhi : సొంత నియోజకవర్గంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర..

Rahul Gandhi : సొంత నియోజకవర్గంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర..
Rahul Gandhi : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర 22వ రోజూ ఉత్సాహంగా సాగుతోంది

Rahul Gandhi : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర 22వ రోజూ ఉత్సాహంగా సాగుతోంది. కేరళలో ఇక ఇవాళే యాత్రకు చివరిరోజు. సొంత నియోజకవర్గం వాయినాడ్‌లో యాత్ర చేస్తున్నారు రాహుల్. స్థానికులను కలసి సమస్యలు తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్‌ కేడర్‌కి దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

లంచ్‌ బ్రేక్‌ తర్వాత 4గంటల 45 నిమిషాలకు అమాయ్కుళం నుంచి తిరిగి యాత్ర ప్రారంభించారు రాహుల్‌ గాంధీ. గుడలూరు వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఇక్కడ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు రాహుల్‌. అనంతరం తమిళనాడులోని నీలగిరి చేరుకుంటారు. రాత్రికి మార్నింగ్‌ స్టార్‌ HSS హాటల్‌లో బస చేస్తారు.

ఇవాళ ఉదయం ఆరున్నర గంటలకు మాలప్పురంలోని చెంగతర నుంచి యాత్రను ప్రారంభించారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్‌ నేతలు,కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో రాహుల్ వెంట నడిచారు. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు మానిమౌలిలో మార్నింగ్‌ బ్రేక్‌ ఇచ్చారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని తరువాత కాంగ్రెస్‌ కార్యకర్తలు, స్థానికులతో సమావేశం అయ్యారు రాహుల్‌.

మరోవైపు భారత్ జోడో యాత్ర కేరళలో ఉత్సాహంగా కొనసాగుతోంది. రాహుల్ పాదయాత్రలో పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. అందరికీ అభివాదం చేసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. రాహుల్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, సెల్ఫీలు దిగేందుకు చిన్నాపెద్దా పోటీ పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రాహుల్ గాంధీ రహదారి పక్కన ఉన్న ప్రజల వద్ద ఆగి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. కేరళ సంప్రదాయ నృత్యాలు, క్రీడల్లో ఆసక్తిగా పాల్గొంటూ స్థానికుల్లో జోష్‌ నింపుతున్నారు. రాహుల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో యాత్రలో ప్రజలు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story