Congress : దిగ్విజయంగా కొనసాగుతోన్న రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'..

Congress : కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర 21వ రోజు రాహుల్ గాంధీ నియోజకవర్గం వాయినాడ్లోకి ప్రవేశించింది. రాహుల్ తన సొంత నియోజకవర్గంలో 3రోజుల పాటు యాత్రను కొనసాగించనున్నారు. తన నియోజకవర్గంలోని ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన 21వ రోజు జోడోయాత్ర ముగిసింది. సాయంత్రం వండూర్ జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈవినింగ్ సెషన్ యాత్ర.. నిలంబర్ టౌన్ వరకు చేరుకుంది. ప్రస్తుతం ఆయన నిలంబర్లో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతున్నారు. అయితే రాహుల్ వాయినాడ్లోకి రావడంతో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంతో డ్యాన్సులు చేశారు.
ఇక రాత్రి నిలంబర్లోని అమల్ కాలేజ్లో రాహుల్ బస చేయనున్నారు రాహుల్. కాగా ఇప్పటివరకు రాహుల్ గాంధీ 470 కిలోమీటర్ల పైగా పాదయాత్ర పూర్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com