Rahul Gandhi: నేడు రాయ్బరేలీలో రాహుల్గాంధీ

లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం ఉదయం రాయబరేలీకి వీళ్ళనున్నారు. ముందు విమానాశ్రయానికి చేరుకొని అక్కడినుంచి రోడ్డు మార్గంలో భూమా అతిథి గృహానికి చేరుకోనున్నారు. అతిథి గృహంలో పార్టీ కార్యకర్తలతో రాహుల్ సమావేశమవుతారు. జిల్లా అభివృద్ది పనులపై ఆయన పార్టీ కార్యక్తరలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే, నియోజకవర్గ ప్రజలతో, కార్మికులతో సమావేశమై వారి కష్టాలను అడిగి తెలుసుకోనున్నారు అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంకజ్ త్రిపాఠి తెలిపారు. కాగా, లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఎంపీ, ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ ఇవాళ తన సన్నిహితుల మధ్య ఉండనున్నారు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రాహుల్ తన పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటించడం ఇది రెండోసారి.. ఈ సమయంలో ఆయన తన ఆత్మీయుల కష్టాలను వినడమే కాకుండా జిల్లా అభివృద్ధిలో వాస్తవికతను కూడా తెలుసుకోనున్నారు. ఈ సమయంలో రాహుల్ తల్లి రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఫండ్స్ నుంచి రాహుల్ చేసిన పని గురించిన సమాచారం కూడా తీసుకోనున్నారు. రాహుల్ గాంధీ ఒకరోజు పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భూమా అతిథి గృహంలో జరిగే సమావేశంలో కాంగ్రెస్ పార్టీని మరింత శక్తివంతం చేయడంపై చర్చించే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com