Pamban Rail Bridge: సముద్ర బ్రిడ్జిపై హై-స్పీడ్ ట్రయల్ రన్ సక్సెస్

భారతీయ రైల్వే వ్యవస్థలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో కలిపే భారీ వంతెన (పంబన్) పూర్తయింది. సముద్రం గుండా ఎలాంటి ఆటంకం లేకుండా నౌకలు వెళ్లేలా ఏర్పాటు చేసిన వర్జికల్ లిఫ్ట్ బ్రిడ్జిని తొలిసారిగా సముద్రం మధ్యలో 17 మీటర్ల ఎత్తులో రూ.550 కోట్లతో నిర్మించారు.
నవంబర్ 13, 14 తేదీల్లో తనిఖీలు నిర్వహించామని రైల్వే సేఫ్టీ కమిషనర్ (సౌత్ జోన్) ఏఎం చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వంతెనపై వివిధ ప్రాంతాల్లో నడిచి, నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం బ్రిడ్జి మధ్యలో ఉన్న లిఫ్టింగ్ సిస్టమ్ను, మండపం నుంచి రామేశ్వరం వెళ్లే హైస్పీడ్ రైలు ట్రయల్ రన్ను పరిశీలించారు.
మదురై డీఆర్ఎం శరత్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. ‘‘కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి పునాది నిర్మాణాన్ని పరిశీలించాం.. అలాగే లిఫ్టింగ్ సిస్టమ్కు సంబంధించిన ఆపరేషనల్ టెస్ట్ కూడా నిర్వహించాం.. ఇప్పటికే ఉన్న అన్ని ఫీచర్లను క్షుణ్ణంగా పరిశీలించాం.. అదే విధంగా టెస్ట్ రన్ కూడా నిర్వహించాం. మండపం నుంచి రామేశ్వరం వరకు 90 కి.మీ వేగంతో 15 నిమిషాలు పట్టింది. ప్రస్తుతం వదిలివేయబడిన పాత రైల్వే వంతెన శిథిలావస్థకు చేరుకుంది జాతీయ స్మారక చిహ్నంగా మార్చేందుకు నిర్ణయం తీసుకుంటాం.’’ అని వెల్లడించారు.
‘‘సముద్రంలో 333 కాంక్రీట్ పునాదులు మరియు 101 కాంక్రీట్ స్తంభాలు నిర్మించబడ్డాయి. భవిష్యత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని డబుల్ ట్రాక్కు అనుగుణంగా పునాది మరియు పైర్లను విస్తరించారు. అయితే ప్రస్తుత డిమాండ్ను పరిగణనలోకి తీసుకొని ఒకే రైలు మార్గాన్ని నిర్మించారు.’’ అని రైల్వే అధికారి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com