Rajasthan : పట్టాలపై రీలు చేస్తుండగా రైలు

రాజస్థాన్లోని రాజ్సమంద్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భార్యాభర్తలు గోరంఘాట్ వంతెనపై రీలు చేస్తున్నారు. ఇంతలో ఎదురుగా రైలు వచ్చింది. వారి ప్రాణాలను కాపాడుకోవడానికి వంతెన నుంచి సుమారు 90 అడుగుల లోతైన కాలువలోకి దూకవలసి వచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను రైలు లోకో ఫైలట్ రూపొందించినట్లు చెబుతున్నారు.
భార్యాభర్తలు స్పృహలోకి వచ్చిన తర్వాత వారిని విచారించి వారి కుటుంబీకులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. అదే క్రమంలో రెండు రోజుల క్రితం కూడా గోరంఘాట్ రైల్వే బ్రిడ్జిపై రీలు చేయాలని నిర్ణయించుకుని బ్రిడ్జి మధ్యలోకి చేరుకుని వీడియోలు తీయడం మొదలుపెట్టారు. ఇంతలో ఎదురుగా రైలు వచ్చింది. అది చూసి ఇద్దరూ భయపడ్డారు. బ్రిడ్జి అంచు దూరంగా ఉండడంతో పరిగెత్తి ఒడ్డుకు కూడా చేరుకోలేకపోయారు.
రైలు అతివేగంతో రావడంతో ప్రాణాలను కాపాడుకునేందుకు ఇద్దరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని 90 అడుగుల లోతున్న గుంతలోకి దూకారు. ఈ ఘటనను రైలు సహ డ్రైవర్ తన మొబైల్ కెమెరాలో బంధించాడు. ఈ ఘటనపై డ్రైవర్ స్వయంగా పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిద్దరినీ కాలువలో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. అయితే ఇద్దరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com