రాజ్యసభ నుంచి 8 మంది ఎంపీల సస్పెన్షన్

రాజ్యసభలో రగడ సృష్టించిన ఎంపీలపై చర్యలకు ఉపక్రమించారు చైర్మన్ వెంకయ్యనాయుడు.. 8 మంది ఎంపీలను వారంపాటు సస్పెండ్ చేశారు.. వారిలో డెరెక్ ఓబ్రెయిన్, సంజయ్ సింగ్, రాజు సతవ్, కెకె రాగేష్,రిపున్ బోరా, డోలా సేన్, సయ్యద్ నజీర్ హుస్సేన్ ఎలామరన్ కరీం ఉన్నారు. సభ్యులను సస్పెండ్ చేయడంతో ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో రాజ్యసభ కార్యకలాపాలను 30 నిమిషాలపాటు వాయిదా వేశారు చైర్మన్ వెంకయ్యనాయుడు.

Tags

Read MoreRead Less
Next Story