Ayodhya: అక్షత పూజతో ప్రతిష్ఠాపన వేడుకకు శ్రీకారం

Ayodhya:  అక్షత పూజతో  ప్రతిష్ఠాపన వేడుకకు శ్రీకారం
ప్రతీ ఇంటికి అక్షింతల పంపిణీకి ఏర్పాట్లు

అయోధ్యలో శ్రీరామ మందిరంలో ప్రతిష్టాపన పూజలు ఆదివారం సంప్రదాయం ప్రకారం అక్షత పూజతో మొదలయ్యాయి. ఆలయంలోని రామదర్బార్, శ్రీరాముని ఆస్థానంలో పసుపు, దేశవాళీ నెయ్యి కలిపిన 100 క్వింటాళ్ల బియ్యంతో అక్షత పూజ నిర్వహిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ తెలిపింది.

కోట్లాది మంది హిందువులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఆలయ తుది దశ పనులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తి కానుండగా.. వచ్చే ఏడాది జనవరి 22 వ తేదీన అయోధ్య రామమందిరంలో రాముడు కొలువుదీరనున్నాడు. దీనికి సంబంధించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే తేదీని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే అయోధ్య రామాలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి అతిథులను ఆహ్వానించే పనిలో ట్రస్ట్ సభ్యులు తలమునకలై ఉన్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఢిల్లీలోని ఆయన నివాసంలోకి వెళ్లి.. రామాలయ ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కావాలని ట్రస్ట్ సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నట్లు తెలుస్తోంది.


దేశంలోని 45 సంస్థాగత ప్రావిన్సుల నుంచి అయోధ్యకు చేరుకున్న విశ్వ హిందూ పరిషత్ లోని 90 మంది,ఆర్ఎస్ఎస్ సభ్యులకు ఈ పూజిత్ అక్షత్ పంపిణీ చేయనున్నారు. ఈ వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ సభ్యులు జనవరి 22వతేదీ లోపు ముడుపుల వేడుకకు ముందు దేశవ్యాప్తంగా బియ్యాన్ని పంపిణీ చేస్తారని ట్రస్ట్ తెలిపింది. ఈ అక్షింతలను పంపిణీ చేయడం ద్వారా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తామని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పేర్కొంది. ఈ అక్షింతలను జనవరి 1 నుంచి 15వతేదీల మధ్య కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా కార్యకర్తలు హిందువుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయనున్నారు.

అయితే అయోధ్య రాముడి విగ్రహానికి సంబంధించిన తాత్కాలిక చిత్రాలను ఆలయ ట్రస్టు సభ్యులు గతంలో విడుదల చేశారు. ముఖం మీద మధురమైన చిరునవ్వుతో, చేతిలో విల్లుతో నిలబడి ఉన్న రూపంలో రాముడు ఉంటాడని తెలిపారు. కర్ణాటకలోని కర్కర్, హిగ్రీవన్‌కోట్ గ్రామాల నుంచి తీసుకొచ్చిన రాళ్లతో ఈ రాముడి విగ్రహాన్ని నిర్మిస్తామని గతంలోనే అధికారులు వెల్లడించారు.

అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించనున్న రాముడి విగ్రహం కోసం మొత్తంగా 3 విగ్రహాలను తయారు చేస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. 3 విగ్రహాలను వేర్వేరు శిల్పులు చెక్కుతున్నారని.. అందులో అత్యంత సుందరంగా ఉన్న దాన్ని ఎంపిక చేసి.. అయోధ్య రామ మందిరంలోని గర్భ గుడిలో ప్రతిష్ఠాపన చేస్తారని వెల్లడించారు. 51 అంగుళాల ఎత్తుతో బాలుడి రూపంలో రాముడి విగ్రహం ఉంటుందని తెలిపారు. ధనస్సు, విల్లు ధరించి.. కమలంపై కూర్చొని ఉంటాడని చెప్పారు.


Tags

Read MoreRead Less
Next Story