India-China: చైనాతో సంబంధాలపై విదేశాంగ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

తూర్పు లద్దాఖ్లో ఐదేళ్ల క్రితం భారత్, చైనా సైనికుల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగి ఐదేళ్లు అవుతున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దీనిపై స్పందించారు. ప్రస్తుతం చైనాతో భారత్ సంబంధాలు సరిగ్గా లేవని, ఎందుకంటే సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతకు భంగం కలిగిందని జైశంకర్ తెలిపారు. అందుకే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని చైనా గ్రహించాలని, సొంత ప్రయోజనాలను గుర్తించడం కాదని ప్రధాని మోదీ అన్నారని చెప్పారు.
చైనాతో మిగిలిపోయిన సమస్యల పరిష్కారంపై భారత్ ఆశాభావంతో ఉందని జైశంకర్ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలు పునరుద్ధరించడంపైరనే సరిహద్దులో శాంతి, ప్రశాంతత ఆధారపడి ఉంటాయని అన్నారు. మిగిలిపోయిన సమస్యలు ప్రధానంగా పెట్రోలింగ్ హక్కులు, పెట్రోలింగ్ సామర్ధ్యాలకు సంబంధించినవని చెప్పారు. చైనాతో సమస్యల పరిష్కారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే పూర్తి స్థాయిలో అభిప్రాయాన్ని తెలిపారని జైశంకర్ అన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఉండాలని ప్రతి దేశం కోరుకుంటుందని చెప్పారు.
సరిహద్దుల్లో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ.. వాణిజ్యం ఎందుకు పెరుగుతోందనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ సమాధానమిచ్చారు. చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ.. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణంపైనే ఆధారపడి ఉందని ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో గస్తీ హక్కులు సహా పలు అంశాలపై ఇంకా సయోధ్య కుదరాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2014కి ముందు తయారీ రంగానికి సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కుండబద్దలు గొట్టారు. 2020లో గల్వాన్లో సైనిక ఘర్షణ తర్వాత భారత్-చైనా మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య పలు దఫాల్లో చర్చలు జరిగినప్పటికీ.. ఇంకా అనేక అంశాలపై సయోధ్య కుదరలేదు. భారత్ వైఖరి న్యూట్రల్ గానే ఉన్న చైనా మాత్రం కయ్యానికి కాలుదువ్వుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com