SAD: భార్య మృతదేహాన్ని బైక్‌కు కట్టి..

SAD: భార్య మృతదేహాన్ని బైక్‌కు కట్టి..
X

మహా­రా­ష్ట్ర­లో­ని నా­గ్‌­పూ­ర్‌­లో రక్షా­బం­ధ­న్ రో­జున చో­టు­చే­సు­కు­న్న ఈ ఘటన మన­సు­ను కల­చి­వే­స్తోం­ది. భా­ర్య­తో ఆనం­దం­గా బయ­లు­దే­రిన అమి­త్ యా­ద­వ్ జీ­వి­తం­లో క్ష­ణా­ల్లో చీ­క­ట్లు కమ్ము­కు­న్నా­యి. జా­తీయ రహ­దా­రి­పై ట్ర­క్కు ఢీ­కొ­ని భా­ర్య గ్యా­ర్సి ప్రా­ణా­లు కో­ల్పో­యిం­ది. గా­యా­ల­తో తల్ల­డి­ల్లు­తు­న్న భర్త, భా­ర్య మృ­త­దే­హా­న్ని ఇం­టి­కి తీ­సు­కె­ళ్లా­ల­ను­కు­న్నా­డు. కానీ అం­బు­లె­న్స్ లేదు, సాయం చే­యా­ల­ను­కు­నే మన­సు­లు లేవు. దా­రి­లో వె­ళ్తు­న్న వా­హ­న­దా­రు­లం­ద­రి­నీ వే­డు­కు­న్నా­డు… ఎవ్వ­రు ఆగ­లే­దు. చి­వ­రి­కి తన బైక్ వె­నుక భా­ర్య మృ­త­దే­హా­న్ని తా­ళ్ల­తో కట్టి స్వ­గ్రా­మం వైపు బయ­ల్దే­రా­డు. ఆ దృ­శ్యం చూ­సిన వా­రం­ద­రి కళ్ల­లో నీ­ళ్లు తి­రి­గా­యి. హృ­ద­యా­లు ము­క్క­ల­య్యా­యి. పో­లీ­సు­లు అడ్డు­కొ­ని మృ­త­దే­హా­న్ని ఆసు­ప­త్రి­కి తర­లిం­చి­నా… ఈ ఘటన మనలో మి­గి­లిన మా­న­వ­త్వం ఎక్క­డుం­దో ప్ర­శ్ని­స్తోం­ది.

Tags

Next Story