Sanjay Malhotra: ఆర్బీఐ నూతన గవర్నర్గా మల్హోత్రా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మంళవారం శక్తికాంత దాస్ పదవీ కాలం ముగిసింది. అందరికీ వీడ్కోలు చెబుతూ వెళ్లిపోయారు. తదుపరి గవర్నర్గా సోమవారం సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. మల్హోత్రా.. రాజస్థాన్ కేడర్కు చెందిన 1990 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి.
సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్గా మూడేళ్ల పాటు ఉండనున్నారు. బుధవారం నుంచి మూడేళ్లపాటు ఆయన బాధ్యతలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మల్హోత్రా..కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, యూఎస్లోని ప్రిన్స్టన్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. 33 ఏళ్ల కెరీర్లో పవర్, ఫైనాన్స్, టాక్సేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గనులు మొదలైన అనేక రంగాల్లో పని చేసిన అనుభవం ఉంది. రెవెన్యూ కార్యదర్శిగా పనిచేయక ముందు ఆర్థిక సేవల శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక మరియు పన్నుల విషయంలో విస్తృత అనుభవం ఉంది. ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నుల కోసం పన్ను విధాన రూపకల్పనలో మల్హోత్రా కీలక పాత్ర పోషించారు.
పదవీ విరమణ చేసిన శక్తికాంత్ దాస్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ నిన్న డిసెంబర్ 10) పదవి విరమణ చేసారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.. అందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్బీఐ బ్యాంక్కు నాయకత్వం వహించే అవకాశం ఇవ్వడంతో పాటు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. గత ఆరేళ్లలో ఆర్థిక- ద్రవ్య సమన్వయం అత్యుత్తమంగా ఉందని శక్తికాంత్ దాస్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com