Covid 19: మహమ్మారికి ఒక్క మ్యుటేషన్ దూరంలో!

ప్రపంచాన్ని వణికించిన కొవిడ్-19 లాంటి మరో ప్రాణాంతక వైరస్ మానవాళిపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రమాదకర గబ్బిలాల వైరస్ను కూడా ఇటీవలే చైనాలోనే కనుగొన్నారు. ఇది మహమ్మారిగా విరుచుకుపడటానికి ఒకే ఒక్క మ్యుటేషన్ దూరంలో ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ను ‘హెచ్కేయూ5-సీవోవీ-2’గా పిలుస్తున్నారు. మెర్బెకో వైరస్లు అని పిలిచే పెద్ద వ్యాధికారక సమూహంలో ఇది భాగమని గుర్తించారు.
ఇందులో ప్రమాదకరమైన ‘మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్’ (ఎంఈఆర్ఎస్-సీవోవీ) కూడా ఉన్నది. అరేబియా ద్వీపకల్పంలో నివసించే వారు లేదంటే అక్కడికి వెళ్లిన వారు దీని బారినపడుతున్నారు. తాజాగా కనుగొన్న కొత్త వైరస్ కూడా ఎంఈఆర్ఎస్ను పోలి ఉండటంతో శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఈ అధ్యయన వివరాలు నేచర్ కమ్యూనికేషన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
దేశంలో మొత్తం యాక్టివ్ కరోనా కేసులు : 5,364
కొత్తగా నమోదైన కేసులు : 498
ఈ ఏడాది ఇప్పటివరకు మరణాలు-55
తాజాగా నమోదైన మరణాలు-4
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com