
మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లా ఖుడోసోడి గ్రామానికి చెందిన సచిన్ నాగ్పూరె అనే 25 ఏళ్ల యువకుడు ఒక కారు మెకానిక్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతడి కుటుంబానికి ఒక పొలం కూడా ఉంది. గత గురువారం అంటే జూన్ 19 ఉదయం సచిన్ తన పొలానికి ఉదయాన్నే వెళ్లినప్పుడు అక్కడ నడుస్తూ ఉండగా.. మొక్కల మధ్య నిద్రిస్తున్న ఒక నల్లని విషపూరితమైన పాముపై సచిన్ తెలియక కాలుమోపాడు. దీంతో ఒక్కసారిగా లేచిన ఆ సర్పం సచిన్ కాలుపై బలంగా కాటేసింది. సాధారణంగా విషసర్పం కాటేస్తే మనిషి చనిపోతారు. కానీ మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఖుద్సోడి గ్రామంలో విషపూరిత పాము కాటేసినా అతడికి ఏం కాలేదు. అంతేకాక కాటేసిన సర్పమే చనిపోయింది. బలంగా కాటేసినప్పుడు పాము కూరలపై ఒత్తిడి ప్రభావంతో అది మరణించొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఔషధ మూలికలతో పళ్లు తోముకుంటానని, అందుకే ఇలా జరిగి ఉండొచ్చని సచిన్ భావిస్తూన్నాడు. ఈ పాము చాలా ప్రమాదకరమని..కాటు తరువాత మనిషి చనిపోయే అవకాశం ఎక్కువని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com