Sonia Gandhi: విచారణకు రాలేకపోతున్నానంటూ ఈడీకి సోనియా గాంధీ లేఖ..

Sonia Gandhi: కరోనా నుంచి ఇంకా కోలుకోని కారణంగా ఇవాళ ఈడీ విచారణకు హాజరుకాలేకపోతున్నట్టు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వివరణ ఇచ్చారు. జూన్ 1 నుంచి సోనియా కోవిడ్తో బాధపడుతున్నారు. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. హోమ్ ఐసోలేషన్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ED ఎంక్వైరీకి రాలేకపోతున్నట్టు సమాచారం ఇచ్చారు. జూన్ 1న, 7న చేసిన కోవిడ్ పరీక్షల వివరాలను ఈడీకి పంపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీలాండరింగ్ కేసులో సోనియాగాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది.
ఇవాళ విచారణకు రావాలని చెప్పింది. అనారోగ్యం కారణంగా వెళ్లలేకపోతున్నందున తదుపరి వాయిదా ఎప్పుడదనేదానిపై త్వరలో స్పష్టత రానుంది. అటు, ఈ నెల 13న రాహుల్గాంధీ ఇదే కేసులో ED ముందుకు వెళ్లనున్నారు. ఈ కేసులో నోటీసులు ముమ్మాటికీ కక్ష సాధింపేనంటూ కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే మండిపడుతున్నాయి. 2015లోనే ఈ కేసును ఈడీ మూసివేసినప్పటికీ.. బీజేపీ ప్రభుత్వం కావాలనే తిరగదోడుతోందని విమర్శిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com