Mahakumbh 2025 : తొక్కిసలాట అనంతరం సీఎం యోగి ఏం చెప్పారంటే..

Mahakumbh 2025 :  తొక్కిసలాట అనంతరం సీఎం యోగి  ఏం చెప్పారంటే..
X
ప్రత్యేకంగా సంగం వద్దకే రావాల్సిన అవసరం లేదన్న ముఖ్యమంత్రి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళాలో సంగం ఒడ్డున జరిగిన తొక్కిసలాటపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. సంగం, అఖారా మార్గ్ వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉందని తెలిపారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తూ, పోలీసులు, పరిపాలనా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. భక్తులు ఎక్కడ ఉన్నా అక్కడే స్నానం చేయొచ్చని, ప్రత్యేకంగా సంగం వద్దకే రావాల్సిన అవసరం లేదని సీఎం యోగి తెలిపారు.

మహా కుంభమేళాలో రాత్రి జరిగిన తొక్కిసలాట తర్వాత పరిస్థితి మరోసారి అదుపులోకి వచ్చింది. సంగంలోని అన్ని ఘాట్లలో స్నానాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సంగంలోని అన్ని ఘాట్లలో స్నానాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఎలాంటి పుకార్లను పట్టించుకోవద్దని యోగి అన్నారు. స్నానాలు చేసేవారి కోసం అనేక ఘాట్‌లను నిర్మించామని, అక్కడ వారు సౌకర్యవంతంగా స్నానం చేయవచ్చని సిఎం యోగి అన్నారు. పరిపాలన సూచనలను అందరూ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పుకార్లను పట్టించుకోవద్దని సీఎం యోగి అందరికీ విజ్ఞప్తి చేశారు.

మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగిందనే వార్తలు వెలువడ్డాయి. మరోవైపు, సంగం వద్ద స్నానాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రజలు ప్రశాంతంగా స్నానం చేస్తున్నారు. ఉదయం మళ్ళీ స్నానం చేస్తున్న వ్యక్తుల వీడియోలు బయటపడ్డాయి. మౌని అమావాస్య సందర్భంగా ప్రజలు మహాకుంభంలోని త్రివేణి సంగమంలో స్నానం చేయడం కొనసాగించారు.


Tags

Next Story