Ironman Challenge: ఐరన్‌మ్యాన్ ఛాలెంజ్ పూర్తి చేసిన బీజేపీ ఎంపీ..

Ironman Challenge: ఐరన్‌మ్యాన్ ఛాలెంజ్ పూర్తి చేసిన బీజేపీ ఎంపీ..
X
ప్రధాని మోదీ రియాక్షన్ ఇదే..

బీజేపీ(BJP) ఎంపీ (దక్షిణ బెంగళూరు) 33 ఏళ్ల తేజస్వి సూర్య మరోసారి తన ఫిట్‌నెస్‌ను చాటుకున్నారు. గోవాలో జరిగిన ‘ఐరన్ మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్ ఛాలెంజ్’‌ను విజయవంతంగా పూర్తి చేసిన తొలి ఎంపీగా ఆయన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఆయన 1.9 కి.మీ ఈతకొట్టారు. 90 కి.మీ మేర సైక్లింగ్ చేశారు. 21.1 కి.మీ మేర రన్నింగ్ చేశారు. ఈ ఈవెంట్‌లోని అన్ని విభాగాలను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసేందుకు దాదాపు నాలుగు నెలల పాటు తేజస్వి సూర్య(Tejasvi Surya) శ్రమించారు. ఈసందర్భంగా ఆయనను అభినందిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Modi) ట్వీట్ చేశారు. తేజస్వి సూర్య సాధించిన ఈ ఫీట్ ఎంతోమంది యువతను ఫిట్‌నెస్ యాక్టివిటీస్ దిశగా నడిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

2022 సంవత్సరంలో గోవాలో జరిగిన ఈ పోటీల్లోనూ తేజస్వి పాల్గొన్నప్పటికీ.. కేవలం సైక్లింగ్ విభాగాన్ని ఆయన పూర్తి చేయగలిగారు. ఈసారి జరిగిన పోటీల్లో 50కిపైగా దేశాలకు చెందిన ఔత్సాహికులతో పాటు భారత్‌లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 120 మందికిపైగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారిలో 15 శాతం మంది మహిళలు ఉన్నారు. కాగా, ఈత, సైక్లింగ్, రన్నింగ్ ఈవెంట్స్ కలిసి ఉన్నందు వల్లే దీనికి ట్రయాథ్లాన్ అనే పేరు వచ్చింది. ఈ మూడు ఈవెంట్ల మొత్తం టార్గెట్ 70.3 మైళ్లు (113 కి.మీ). అందుకే ఈ ఈవెంట్‌కు ‘ఐరన్ మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్ ఛాలెంజ్’‌ అనే పేరు పెట్టారు.

మోదీ ప్రశంసలు..

‘ఐరన్‌మ్యాన్ ఛాలెంజ్’ను పూర్తి చేసిన ఎంపీని స్వయంగా ప్రధాని మోదీ కూడా ప్రశంసించారు. ‘‘ప్రశంసదగిన ఫీట్ సాధించారు!. ఫిట్‌నెస్‌కు సంబంధించిన కార్యకలాపాల విషయంలో మీరు స్వీకరించిన ఛాలెంజ్ చాలా మంది యువకులకు స్ఫూర్తినిస్తుందని నేను భావిస్తున్నాను’’ అని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

కాగా ఎంపీ తేజస్వి సూర్య రిలే టీమ్‌లో భాగంగా ఐరన్‌మ్యాన్ 70.3 ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. అథ్లెట్లు, ఫిట్‌నెస్ ఔత్సాహికుల కోసం నిర్వహించే ఈ ప్రీమియర్ ఈవెంట్‌లో 50కి పైగా దేశాల అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సంవత్సరం నిర్వహించిన రేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులకు చెందిన 120 మంది పాల్గొన్నారు. పాల్గొన్న అథ్లెట్లలో మహిళళు 12-15 శాతం మంది ఉన్నారు. ఈ సంవత్సరం పాల్గొనేవారిలో 60 శాతానికి పైగా తొలిసారి పాల్గొన్నవారే కావడం విశేషం.

Tags

Next Story